బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా నలుగురు వ్యక్తులు.. వారిని ఆపి చెక్ చేయగా.!
తెనాలిలో అడ్డగోలుగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ముఠాను పట్టుకున్నారు టూ-టౌన్ పోలీసులు. వారంతా తునిలో గంజాయిను కొనుగోలు చేసి.. వాటిని చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి స్థానికంగా ఉన్న రద్దీ ప్రదేశాల్లో..
తెనాలిలో అడ్డగోలుగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ముఠాను పట్టుకున్నారు టూ-టౌన్ పోలీసులు. వారంతా తునిలో గంజాయిను కొనుగోలు చేసి.. వాటిని చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి స్థానికంగా ఉన్న రద్దీ ప్రదేశాల్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని సభ్యులను కొల్లిపర మండలం వల్లభాపురంకు చెందిన పాముల రుషి బాబు, తూమాటి శ్యాం కుమార్, మండ్రు రాజ్ కుమార్, మల్లోల శోభన్ బాబుగా గుర్తించారు. వీరంతా కూడా చెడు వ్యసనాలకు బానిసలై.. ఈజీ మనీ కోసం ఆశపడి ఇలాంటి తప్పుదోవను ఎంచుకున్నారని సీఐ తెలిపారు.
వీరంతా తుని నుంచి ఒక కేజీ గంజాయిని రూ. 5 వేల చొప్పున 2 కేజీలు కొనుగోలు చేసి, దానిని 20 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి వాటిని 200 రూపాయలకు తెనాలిలోని రైల్వే స్టేషన్ ఏరియా, బస్ స్టాండ్ ఏరియాతో పాటు తెనాలి చుట్టపక్కల ప్రాంతాల్లో అమ్ముతూ డబ్బులు సంపాందించేవారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఈ నలుగురు దొంగిలించిన మోటార్ సైకిళ్ళతో గంజాయి అమ్మేందుకు తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు రాగానే పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రెండు కేజీల గంజాయి, దొంగలించిన నాలుగు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు
లక్కీ ఇండియన్.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే

