మన హీరోలు వద్దా.. పరభాషా స్టార్లే ముద్దా? టాలీవుడ్ దర్శకుల కొత్త రూట్ ఇదే!
టాలీవుడ్ దర్శకుల చూపు ఇప్పుడు సొంత హీరోలకే పరిమితం కావడం లేదు. వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ముల, పూరీ జగన్నాథ్, కళ్యాణ్ శంకర్, శైలేష్ కొలను వంటి దర్శకులు పరభాషా హీరోలతో సినిమాలు చేస్తున్నారు లేదా ప్లాన్ చేస్తున్నారు. తమిళ, హిందీ హీరోల వైపు పెరుగుతున్న ఈ ఆసక్తికి కథల అవసరమా, మార్కెట్ విస్తరణా, లేక మన హీరోల డేట్స్ సమస్యా అన్న చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది.
తెలుగు దర్శకులను మన హీరోలు పట్టించుకోవట్లేదా లేదంటే వాళ్ళు రాసుకుంటున్న కథలకు మన హీరోలే సరిపోవట్లేదా..? ప్రతీ కథకు పక్క భాష నుంచి హీరోలనెందుకు మన దర్శకులు తెచ్చుకుంటున్నారు.?? వందల కోట్ల మార్కెట్ ఉన్న మన హీరోలను కాదని.. పరాయి భాషల్లోని హీరోల వైపు ఎందుకు మన దర్శకుల అడుగులు పడుతున్నాయి..? మన దర్శకులు ఎందుకో మరి ఈ మధ్య ఎక్కువగా పరభాషా హీరోల వైపే వెళ్తున్నారు. ఒక్కరో ఇద్దరో అంటే ఏమో అనుకోవచ్చు కానీ చాలా మంది డైరెక్టర్స్ చూపులు ఇండస్ట్రీ దాటి వెళ్తున్నాయి. వెంకీ అట్లూరి కొన్నేళ్లుగా మన హీరోలతో సినిమాలు చేయడమే మానేసారు.. శేఖర్ కమ్ముల గతేడాది ధనుష్తో కుబేరా చేసారు. ఆఖరికి పూరీ జగన్నాథ్ కూడా విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నారు. స్లమ్ డాగ్ తర్వాత కూడా పూరీ జగన్నాథ్ చూపులు పరభాషా హీరోలపైనే ఉన్నాయని తెలుస్తుంది. సూర్య, ధనుష్లలో ఒకరికి కథ చెప్పి ఒప్పించి సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారీయన. ఇక మ్యాడ్ ఫ్రాంచైజీతో బాగా నవ్వించిన కళ్యాణ్ శంకర్.. ప్రస్తుతం కార్తితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. శైలేష్ కొలను ప్రస్తుతం రోషన్తో ఏమో ఏమో ఇది సినిమా చేస్తున్నా.. నెక్ట్స్ కార్తితో హిట్ 4 లైన్లో పెట్టారు. స్టార్ డైరెక్టర్స్ చూపులు కూడా వేరే ఇండస్ట్రీపైనే ఉన్నాయి. ఆల్రెడీ విజయ్తో వారిసు చేసి హిట్ కొట్టిన వంశీపైడిపల్లి.. ప్రస్తుతం సల్మాన్తో హిందీ సినిమా చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా సూర్యతో ఓ సినిమాకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి మన దర్శకులంతా మన హీరోలను వదిలేసి పక్క ఇండస్ట్రీలకు వెళ్తున్నారు.
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు

