Virupaksha Pre Release Event: ఏలూరుకు పోటెత్తిన మెగా ఫ్యాన్స్.. గ్రాండ్గా విరూపాక్ష ప్రి రిలీజ్ ఈవెంట్
విరూపాక్ష సినిమా ను ఏప్రిల్ 21 న పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాంతారా ఫేమ్ ‘అజనీష్ లోకనాథ్’ ఈ సినిమాకు సంగీతం అందించాడు. . మిస్టరీ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది.
నూతన దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై నిర్మాత బీ.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. సంయుక్త మీనన్ విరూపాక్షలో హీరోయిన్ గా నటించింది. అజయ్, సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, శ్యామల తదితరులు కీ రోల్స్లో నటించారు. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి రచన సహకారం అందించాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న అనంతరం సాయి తేజ్ ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 21 న సినిమా రిలీజ్ అవ్వనుంది. కాగా ఏప్రిల్ 16 (ఆదివారం) ఏలూరులోని సి.ఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. లైవ్ చూడండి…
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

