Saif Ali Khan: సైఫ్‌ పై దాడి సమయంలో కరీనా కపూర్ పార్టీలో ఉన్నారా ?? మనుషుల తీరుపై హీరోయిన్ సీరియస్

Updated on: Jan 28, 2025 | 3:38 PM

అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీతో పాటు తెలుగు సినిమాల్లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుందామె. అయితే అక్షయ్ తో పెళ్లి, పిల్లల తర్వాత రచయితగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై గొంతెత్తుతోంది. అలా తాజాగా సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనపై ట్వింకిల్ ఖన్నా స్పందించింది.

కరీనా కపూర్‌కు అండగా నిలిచింది. ఈ దాడికి కరీనా కపూర్ కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ తన గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. వీటిని ట్వింకిల్ ఖన్నా ఖండించింది. సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక వదంతి వ్యాపించింది. సైఫ్‌పై దాడి జరిగినప్పుడు కరీనా సహాయం చేయలేదని ప్రచారం జరిగింది… దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ వదంతులు మాత్రం ఆగలేదు… మహిళ.. అందులోనూ ఒక వ్యక్తి భార్యపై నిందలు రావడంతో ప్రతిఒక్కరూ ఎంజాయ్‌ చేశారు అలాంటి వారిపై, వారి ఆలోచనా విధానం పై ట్వింకిల్ అసహనం వ్యక్తం చేసింది. అదే విధంగా విరాట్‌ కోహ్లీ సరిగ్గా ఆడనప్పుడల్లా కొంతమంది ఆయన సతీమణి అనుష్క శర్మను నిందిస్తుంటారు. సెలబ్రిటీల విషయంలోనే కాదు సామాన్యుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. భర్తల సమస్యలకు భార్యలను నిందించడం ఏ మాత్రం సరికాదు అంటూ ట్వింకిల్ ఖన్నా అభిప్రాయపడింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: వెంకటేష్‌ ధాటికి వెనక్కి వెళ్లిన బాహుబలి-2

Akhanda 2: అఖండ2 నుంచి హీరోయిన్ అవుట్‌.. రీజన్ ఇదే

బిగ్ బాస్‌ విన్నర్‌గా రైతు బిడ్డ !! లుంగీలో వచ్చి దిమ్మతిరిగేలా చేశాడుగా..

Vishal: ఇష్టమొచ్చినట్లు మాట్లాడి సారీ చెప్పడం అలవాటైంది.. మండిపడ్డ విశాల్

Pushpa 02: అఫీషియల్ డేట్ వచ్చేసిందోచ్‌.. ఇక OTTలో రప్పా రప్పా రచ్చే!

Published on: Jan 28, 2025 01:27 PM