విక్రమార్కుడు సీక్వెల్లో రష్మిక మందన్న.. హీరో ఎవరో తెలుసా ??
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కిన విక్రమార్కుడు టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఈ బ్లాక్బస్టర్ మూవీ హిందీలో రౌడీ రాథోడ్ పేరుతో రీమైకైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ రీమేక్ మూవీ 2012 ఏడాదిలో హయ్యెస్ట్ గ్రాసింగ్ బాలీవుడ్ మూవీగా నిలిచింది.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కిన విక్రమార్కుడు టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఈ బ్లాక్బస్టర్ మూవీ హిందీలో రౌడీ రాథోడ్ పేరుతో రీమైకైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ రీమేక్ మూవీ 2012 ఏడాదిలో హయ్యెస్ట్ గ్రాసింగ్ బాలీవుడ్ మూవీగా నిలిచింది. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత రౌడీ రాథోడ్కు సీక్వెల్ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతోన్నట్లు టాక్. ఈ సీక్వెల్ లో అక్షయ్ కుమార్ స్థానంలో షాహిద్ కపూర్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా రష్మిక మందన్నను ఫిక్స్ చేసినట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. రష్మిక కూడా ఈ సీక్వెల్ కోసం డేట్స్ కేటాయించినట్లు చెబుతున్నారు. రౌడీ రాథోడ్ ఫస్ట్ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సీక్వెల్ను తెరకెక్కించే బాధ్యతను అతడి స్థానంలో అనీస్ బజ్మీ చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం రౌడీ రాథోడ్ -2కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయినట్లు తెలిసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సీక్వెల్కు బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’లో కమలహాసన్ ?? రూ.150 కోట్ల ఆఫర్ లో నిజమెంత ??
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?

