Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన కొడుకు చిలిపితననాన్ని బయటపెట్టిన తమన్ తల్లి

తన కొడుకు చిలిపితననాన్ని బయటపెట్టిన తమన్ తల్లి

Phani CH

|

Updated on: Aug 31, 2024 | 1:13 PM

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా అందిస్తోన్న అద్భుతమైన కార్యక్రమాల్లో తెలుగు ఇండియ్ ఐడల్ ఒకటి. ఇప్పటివరకు విజయవంతగా రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు మూడో సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సీజన్‏కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ గీతా మాధురి, సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా అందిస్తోన్న అద్భుతమైన కార్యక్రమాల్లో తెలుగు ఇండియ్ ఐడల్ ఒకటి. ఇప్పటివరకు విజయవంతగా రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు మూడో సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సీజన్‏కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ గీతా మాధురి, సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి అద్భుతమైన పాటలతో ఆకట్టుకుంటున్నారు కంటెస్టెంట్స్. ఇక ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం మ్యూజిక్ తమన్ మదర్ ఘంటసాల సావిత్రి తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేశారు. ఓటీటీలో సింగింగ్ షో కోసం తొలిసారి వేదికపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. అందులో తన తనయుడు తమన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడంటూ తన కొడుకుపై ప్రేమను కురిపించింది. ప్రస్తుతం ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా జరుగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుతుంది.. ఇప్పుడీ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్ వచ్చేసింది. ఈ షోకి జడ్జ్ గా ఉంటున్న సెన్సేషనల్ కంపోజర్ తమన్ మదర్ ఘంటసాల సావిత్రి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తమన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ చిన్నప్పటి ముచ్చట్లు చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నా.. షాకిచ్చిన బాలీవుడ్ నటి..

కంగనాకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్ ??

బాబోయ్.. స్పై కెమెరా !! కనిపెట్టేదెలా ??

Hyderabad: బిలియనీర్లకు సెంటర్ గా హైదరాబాద్

TOP 9 ET News: అప్పుడు చిరంజీవి వంతైతే.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు