Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బిలియనీర్లకు సెంటర్ గా హైదరాబాద్

Hyderabad: బిలియనీర్లకు సెంటర్ గా హైదరాబాద్

Phani CH
|

Updated on: Aug 31, 2024 | 1:02 PM

Share

మారుతోంది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 కీలక విషయాలు వెల్లడించింది. భారత్‌లో ఎక్కువ మంది బిలియనీర్లు నివసిస్తున్న నగరాల్లో హైదరాబాద్ 3rdప్లేస్ లో ఉంది . ముంబై నగరం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నట్లు నివేదిక తెలిపింది.

బిలియనీర్లకు సెంటర్ గా మారుతుంది హైదరాబాద్ సిటీ .హైదరాబాద్లో ధనవంతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కుబేరులకు అడ్డాగా మారుతోంది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 కీలక విషయాలు వెల్లడించింది. భారత్‌లో ఎక్కువ మంది బిలియనీర్లు నివసిస్తున్న నగరాల్లో హైదరాబాద్ 3rdప్లేస్ లో ఉంది . ముంబై నగరం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇక రాష్ట్రాల ప్రాతిపదికన చూసుకుంటే కుబేరులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు 5thప్లేస్ దక్కింది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ రిలీజ్ అయింది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని రిలీజ్ చేస్తుంది.12 ఇయర్స్ గా వీళ్ళు ఈ లిస్ట్ ఇస్తున్నారు ..ఇది 13thలిస్ట్ .దీని ప్రకారం.. 386 మంది బిలియనీర్లతో ముంబై అగ్రస్థానంలో నిలవగా.. 217 మంది బిలియనీర్లతో దేశ రాజధాని రెండో స్థానంలో ఉంది. ఈ రెండు నగరాల తర్వాత మన హైదరాబాద్ 104 మందితో మూడో స్థానంలో నిలవడం గర్వకారణమనే చెప్పాలి. ఈ ఏడాది కొత్తగా 17 మంది బిలియనీర్లు జాబితాలోకి చేరడంతో బెంగళూరును వెనక్కి నెట్టింది హైదరాబాద్. ఇక రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు ఐదో స్థానం దక్కడం ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదుగుతుందనేందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: TOP 9 ET News: అప్పుడు చిరంజీవి వంతైతే.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు