దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణించిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది మెగాస్టార్ చిరంజీవి అని వ్యాఖ్యానిస్తుండగా.. మరికొందరు భిన్న స్వరం విప్పుతున్నారు. ఇదే విషయంపై సీనియర్ నటుడు నిర్మాత.. ప్రముఖ రాజకీయ నేత మురళీ మోహన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ మెగాస్టార్ ఇటీవల ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణ రావు తర్వాత మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్ అని చెప్పారు. దాసరి జీవించి ఉన్నంత కాలం టాలీవుడ్ కు అన్నివిధాలా అండగా ఉన్నారని.. ఆయన స్థానాన్ని చిరంజీవి కొంతవరకూ భర్తీ చేస్తున్నట్లు అనిపిస్తోందని చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బిజీ రోడ్డుపైకి బుజ్జి కుక్కలు.. దారి తప్పిన వాటిని ఓ దరి చేర్చిన మహిళంటూ నెటిజన్ల భావోద్వేగం!:Viral Video.