AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ అడుగు జాడల్లోనే అంటున్న జాన్వీ కపూర్‌

అమ్మ అడుగు జాడల్లోనే అంటున్న జాన్వీ కపూర్‌

Phani CH
|

Updated on: Oct 27, 2025 | 8:25 PM

Share

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన పర్సనల్ విషయాలపై ఇప్పుడు ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ వార్తలపై స్పందిస్తూ, తల్లి శ్రీదేవి పర్యవేక్షణలోనే ఆ సర్జరీ చేయించుకున్నానని స్పష్టం చేశారు. తన జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక శ్రీదేవి ఉన్నారని, అందుకే కెరీర్‌లో ముందుకు వెళ్తున్నానని జాన్వీ వెల్లడించారు.

బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తన కెరీర్ ప్రారంభంలో మీడియాకు కాస్త దూరంగా ఉండేవారు. అయితే, ఇప్పుడు ఆమె తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. తరచుగా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న జాన్వీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలు, ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ గురించి స్పష్టతనిచ్చారు. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జాన్వీ కపూర్ ధ్రువీకరించారు. అయితే, ఈ సర్జరీ తన తల్లి, దివంగత నటి శ్రీదేవి పర్యవేక్షణలోనే జరిగిందని ఆమె పేర్కొన్నారు. తన లుక్ విషయంలో తనకు ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తులు లేవని, కేవలం తల్లి చెప్పడం వల్లే ఈ సర్జరీ చేయించుకున్నానని జాన్వీ వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే ??

ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

తరుముకొస్తున్న మొంథా తుఫాన్‌.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్

నాగపంచమి వేళ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

ప్రైవేట్ బస్సులంటేనే హడల్‌.. ఆర్టీసీకి పెరిగిన ఆదరణ