AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rajesh: చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!

Aishwarya Rajesh: చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!

Anil kumar poka
|

Updated on: Sep 28, 2024 | 6:35 PM

Share

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ వైరల్‌గా మారిన తరుణంలో చిత్ర పరిశ్రమలో వేధింపులపై నటి ఐశ్వర్య రాజేశ్‌ స్పందించారు. నటీమణులు ధైర్యంగా ఉండాలని తాజాగా ఓ ఇంగ్లిష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లు అవుతోందన్నారు. కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరిగాయన్నారు. చిత్ర పరిశ్రమలో తాను ఎలాంటి వేధింపులనూ ఎదుర్కోలేదనీ చెప్పారు.

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ వైరల్‌గా మారిన తరుణంలో చిత్ర పరిశ్రమలో వేధింపులపై నటి ఐశ్వర్య రాజేశ్‌ స్పందించారు. నటీమణులు ధైర్యంగా ఉండాలని తాజాగా ఓ ఇంగ్లిష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లు అవుతోందన్నారు. కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరిగాయన్నారు. చిత్ర పరిశ్రమలో తాను ఎలాంటి వేధింపులనూ ఎదుర్కోలేదనీ చెప్పారు. వేధింపులకు పాల్పడిన దోషులకు సరైన శిక్ష పడాలని కోరారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి మహిళలకు తాను ఇచ్చే సలహా ఒక్కటే అని తెలిపారు. ధైర్యంగా ఉండాలనీ.. చొరవ తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే స్పందించండనీ చెప్పారు. గట్టిగా మీ స్వరాన్ని వినిపించండి అని తెలిపారు. అవుట్‌డోర్‌ షూట్స్‌కు వెళ్లినప్పుడు సరైన వసతుల్లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని.. టాయిలెట్స్‌ కూడా సరిగ్గా ఉండటం లేదని ఐశ్వర్య రాజేశ్‌ వ్యాఖ్యలు చేశారు.

దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ ఓ నివేదికను సిద్ధం చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండీషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పలు సమస్యలను ఫేస్ చేస్తున్నారని పేర్కొంది. ఇదేతరహా కమిటీని అన్ని చిత్ర పరిశ్రమల్లో ఏర్పాటుచేయాలని నటీనటులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి రోహిణి అధ్యక్షతన కోలీవుడ్‌లో ఓ కమిటీ ఏర్పాటు అయింది. వేధింపులు ఎదురయ్యాయని ఎవరైనా తమ వద్దకువస్తే.. ఆ ఫిర్యాదును సైబర్‌ పోలీస్‌ విభాగానికి అందజేస్తామని రోహిణి తెలిపారు. దోషిగా తేలినవారిని దాదాపు ఐదేళ్లు కోలీవుడ్‌ లో బ్యాన్‌ చేస్తామని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.