AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనో స్టార్‌ హీరో.. అయినా సామాన్యుడిలా తిరుమలకు

అతనో స్టార్‌ హీరో.. అయినా సామాన్యుడిలా తిరుమలకు

Phani CH
|

Updated on: Aug 28, 2024 | 12:20 PM

Share

తిరుమల వెంకన్న ఎంతో పవర్‌ఫుల్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం వేలామంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. అందుకు సినిమా సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. సౌత్‌కి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు కొండకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరో కూడా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు.

తిరుమల వెంకన్న ఎంతో పవర్‌ఫుల్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం వేలామంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. అందుకు సినిమా సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. సౌత్‌కి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు కొండకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరో కూడా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. అయితే ఆయన మాస్క్ పెట్టుకుని ఉండటంతో తొలుత ఎవరూ గుర్తుపట్టలేదు. దారిలో ఓసారి మాస్క్ తీసివేయడంతో.. భక్తులు గుర్తుపట్టి సెల్పీల కోసం ఎగబడ్డారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు. నేచురల్ స్టార్ నాని. ఆయన భార్య, కొడుకుతో కలిసి అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. నడక‌మార్గంలో నానితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు భక్తులు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నాని. ఆయన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ ఈ నెల 29న విడుదల కానుంది. తన నుంచి వైవిధ్యమైన సినిమాలను కోరుకునే ప్రేక్షకుల కోసం సరిపోదా శనివారం మూవీని చేసినట్లు నాని తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారానికి కొన్ని గంటల ముందు జరిగింది ఇదే

పత్తి చేలో కలుపు తీస్తుండగా.. షాకింగ్‌ సీన్‌.. దెబ్బకు..

బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోన్న ‘స్త్రీ’ కథ ఇదే..

రంగుమారిన భీమిలి సముద్రం నీరు !! తీరప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ??

లక్షల రూపాయల మందులు.. ఎలుకలు తినేశాయ్