స‌ట్లెజ్‌ న‌దిలో త‌మిళ డైరెక్ట‌ర్ మృత‌దేహం.. తొమ్మిది రోజుల తర్వాత లభ్యం

తమిళ దర్శకుడు వెట్రి దురైసామి మృతదేహం తొమ్మిది రోజుల తర్వాత దొరికింది. హిమాచల్ రాష్ట్రంలో తన స్నేహితులు గోపీ నాథ్ -తంజిన్‌లతో కలిసి లొకేషన్‌ సెర్చ్‌కు దర్శకుడు వెళ్ళారు. ప్రమాదవశాత్తూ వీరి కారు స‌ట్లెజ్‌ నదిలో పడిపోయింది. తాజాగా వెట్రి దురైసామి మృతదేహం కిన్ననూర్ జిల్లా సట్లెజ్ నది ఒడ్డున సహాయక బృందాలకు దొరికింది. ఈ ప్రాంతం ఘటనా స్థలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. డెడ్ బాడీ సోమవారం లభించింది.

స‌ట్లెజ్‌ న‌దిలో త‌మిళ డైరెక్ట‌ర్ మృత‌దేహం.. తొమ్మిది రోజుల తర్వాత లభ్యం

|

Updated on: Feb 14, 2024 | 5:43 PM

తమిళ దర్శకుడు వెట్రి దురైసామి మృతదేహం తొమ్మిది రోజుల తర్వాత దొరికింది. హిమాచల్ రాష్ట్రంలో తన స్నేహితులు గోపీ నాథ్ -తంజిన్‌లతో కలిసి లొకేషన్‌ సెర్చ్‌కు దర్శకుడు వెళ్ళారు. ప్రమాదవశాత్తూ వీరి కారు స‌ట్లెజ్‌ నదిలో పడిపోయింది. తాజాగా వెట్రి దురైసామి మృతదేహం కిన్ననూర్ జిల్లా సట్లెజ్ నది ఒడ్డున సహాయక బృందాలకు దొరికింది. ఈ ప్రాంతం ఘటనా స్థలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. డెడ్ బాడీ సోమవారం లభించింది. 45 ఏళ్ల దర్శకుడు వెట్రి తన తదుపరి చిత్రం కోసం లొకేషన్‌ సందర్శనకు మరో ఇద్దరితో కలిసి హిమాచల్‌కు వెళ్ళారు. ఆయన స్నేహితుడు తెంజిన్‌ ప్రమాద స్థలంలో శవమై కనిపించాడు. కారును నడిపింది తెంజిన్‌ అని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో వెట్రి మరో స్నేహితుడు గోపీ నాథ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇందిరా గాంధీ మెడికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: మనసు మార్చుకున్న ప్రభాస్‌.. అయితే సందీప్‌ రెడ్డి సినిమా పక్కకే..

బన్నీతో సినిమా చేయాలనుకున్నా.. కానీ ఆయన చెప్పింది వేరే..

డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌ ‘వాలెంటైన్స్ డే’ స్ట్రైక్‌

Sunny Leone: సన్నీలియోన్‌ రెస్టారెంట్‌లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు

Follow us