బాలయ్య, చిరుకు ‘పద్మ’ అవార్డులు ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే…?
నందమూరి నటసింహం బాలకృష్ణకు కేంద్రం రీసెంట్గా పద్మ పురస్కారం ప్రకటించింది. 30 ఏళ్లుగా కళారంగం, సమాజానికి ఆయన చేసిన సేవలకుగాను బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కాగా, తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి కూడా కేంద్రం గతేడాది పద్మ విభూషణ్ ప్రకటించింది. అయితే ఈ ఇద్దరికి పద్మ అవార్డులు దక్కడంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే?
బాలకృష్ణ రీసెంట్గా ‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12న రిలీజై భారీ విజయం దక్కించుకుంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 160+ కోట్లకుపైగా గ్రాస్ వసూల్ చేసింది. అయితే గతేడాది చిరంజీవికి కూడా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా సక్సెస్ తర్వాతే ఆయనకు పద్మ అవార్డ్ దక్కింది. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు కూడా బాబీనే దర్శకుడు కావడం ఇక్కడ మరో విశేషం. అలా ఈ ఇద్దరు టాలీవుడ్ బిగ్ స్టార్లు డైరెక్టర్ బాబీ సినిమా తర్వాత అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకున్నారంటూ నెట్టింట్ వైరల్ చేస్తున్నారు ఈ హీరోలు, డైరెక్టర్ అభిమానులు.
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

