Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య, చిరుకు 'పద్మ' అవార్డులు ఇక్కడ కామన్ పాయింట్‌ ఏంటంటే...?

బాలయ్య, చిరుకు ‘పద్మ’ అవార్డులు ఇక్కడ కామన్ పాయింట్‌ ఏంటంటే…?

Samatha J

|

Updated on: Jan 31, 2025 | 2:16 PM

నందమూరి నటసింహం బాలకృష్ణకు కేంద్రం రీసెంట్​గా పద్మ పురస్కారం ప్రకటించింది. 30 ఏళ్లుగా కళారంగం, సమాజానికి ఆయన చేసిన సేవలకుగాను బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కాగా, తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి కూడా కేంద్రం గతేడాది పద్మ విభూషణ్ ప్రకటించింది. అయితే ఈ ఇద్దరికి పద్మ అవార్డులు దక్కడంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే?

బాలకృష్ణ రీసెంట్​గా ‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12న రిలీజై భారీ విజయం దక్కించుకుంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 160+ కోట్లకుపైగా గ్రాస్ వసూల్ చేసింది. అయితే గతేడాది చిరంజీవికి కూడా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా సక్సెస్​ తర్వాతే ఆయనకు పద్మ అవార్డ్ దక్కింది. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు కూడా బాబీనే దర్శకుడు కావడం ఇక్కడ మరో విశేషం. అలా ఈ ఇద్దరు టాలీవుడ్ బిగ్ స్టార్లు డైరెక్టర్ బాబీ సినిమా తర్వాత అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకున్నారంటూ నెట్టింట్ వైరల్ చేస్తున్నారు ఈ హీరోలు, డైరెక్టర్ అభిమానులు.