AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో మేల్ డామినేషన్‌ మీద గళం విప్పుతున్న బాలీవుడ్ బ్యూటీస్‌

ఇండస్ట్రీలో మేల్ డామినేషన్‌ మీద గళం విప్పుతున్న బాలీవుడ్ బ్యూటీస్‌

Phani CH
|

Updated on: Dec 09, 2025 | 2:54 PM

Share

సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న పురుషాధిక్యతపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సమస్యలపై ఆమె ముంబై కార్యక్రమంలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు ప్రియాంక చోప్రా మద్దతు తెలిపారు. ఇలా ధైర్యంగా మాట్లాడే అమ్మాయిలకు అండగా నిలవాలని ప్రియాంక పిలుపునిచ్చారు. పరిశ్రమ మారాలంటే ఇలాంటి గళాలు పెరగాలని ఆమె అభిప్రాయపడ్డారు.

సినిమా పరిశ్రమలో పురుషాధిక్యత చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉంది. దీనిని మార్చడానికి కొందరు నటీమణులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖంగా నిలుస్తున్నారు జాన్వీ కపూర్. ఆమె ప్రస్తుతం పెద్ది చిత్రంతో బిజీగా ఉన్నారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సమస్యలు, పురుషాధిక్యతపై జాన్వీ కపూర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. “మహిళలు బలహీనులు కాదు. అమ్మాయిగా పుట్టినందుకు గర్విస్తున్నా. నలుగురు అమ్మాయిలు ఉన్న చోట నా అభిప్రాయం స్వేచ్ఛగా చెప్పగలను, కానీ నలుగురు పురుషులు ఉన్న చోట చెప్పలేను. ఈ సమస్యను అనేకసార్లు ఎదుర్కొన్నాను” అని ఆమె వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి

సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు

ఔను.. మా పెళ్లి రద్దయింది.. ఇక నా దృష్టి కేవలం దానిపైనే

సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి

ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది