AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar 3: జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్ 3 గ్రాండ్‌ రిలీజ్‌.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే

Avatar 3: జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్ 3 గ్రాండ్‌ రిలీజ్‌.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే

Phani CH
|

Updated on: Dec 04, 2025 | 2:00 PM

Share

జేమ్స్ కామెరూన్ సృష్టి 'అవతార్ 3: ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న విడుదలవుతోంది. అగ్ని నేపథ్యంలో సాగే ఈ సినిమా, గత భాగాలకంటే గొప్పగా ఉంటుందని అంచనా. IMAX, డాల్బీ విజన్ టెక్నాలజీతో సరికొత్త అనుభూతినిస్తుంది. భారత మార్కెట్‌లో అద్భుతమైన క్రేజ్, భారీ బాక్సాఫీస్ వసూళ్లు సాధిస్తుందని మేకర్స్ ధీమా.

కొందరు దర్శకులకు ఇండస్ట్రీతోనే కాదు..దేశంతో కూడా పనుండదు… అందులో జేమ్స్ కామెరూన్ ఒకరు. పేరుకు హాలీవుడ్ డైరెక్టరే అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి ఆయన సినిమాలు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడానికి సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫ్రాంచైజ్‌గా నిలిచిన ‘అవతార్’ సిరీస్ మూడో భాగం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ ఈ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అవతార్ ఫస్ట్‌పార్ట్‌లో పాండోర ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన కామెరూన్..సెకండ్‌ పార్ట్‌లో సముద్ర గాథను ‘ది వే ఆఫ్ వాటర్’తో చూపించాడు. ఇప్పుడు థర్డ్‌పార్ట్‌లో అగ్ని చుట్టూ మొత్తం కథను నడిపించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్ధమవుతోంది. అందుకే పార్ట్-3కి ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ పెట్టారు. మొద‌టి రెండు భాగాల‌ను మించి ఈ మూడో సినిమా కోసం ఎఫ‌ర్ట్ పెట్టామ‌ని చెబుతోంది అవతార్ టీమ్. కలెక్షన్స్ కూడా అదేస్థాయిలో ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి కొనసాగింపుగా రానున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ఐమ్యాక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి.
డిసెంబర్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్న మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కి భారత మార్కెట్‌లోనూ భారీ క్రేజ్ ఉంది. రీసెంట్‌గా బుక్‌మైషో డేటాలో 12 లక్షలకుపైగా ఇండియన్ లవర్స్ ఈ సినిమాపై తమ ఇంట్రస్ట్‌ను చూపించారు. అడ్వాన్స్‌ ఇంటరెస్ట్‌లో ఇంత భారీ నెంబర్ సాధించడం పెద్ద సినిమాలకే సాధ్యం కాగా..ఇప్పుడు అవతార్ బెంచ్‌మార్క్ సృష్టించింది. మొదటి రెండు భాగాల్లో చూసిన భావోద్వేగం, విజువల్స్‌ ఈసారి కూడా మరింతగా ఉండబోతున్నాయన్న అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అవతార్ హీరో జేక్ సల్లి, హీరోయిన్ నెయ్టిరి మళ్లీ పాండోరా ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఈసారి కథలో కీలకంగా నిలిచేది కొత్త తెగ “యాష్ పీపుల్”. వారి నాయకురాలిగా ఊనా చాప్లిన్ కనిపించబోతున్నారు. ఆమె పాత్ర వరాంగ్‌పై హాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో హైప్ ఉంది. భారత్‌లో అవతార్-3 మూవీ ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే ఈసారి ఐమ్యాక్స్ అనుభవంతో పాటు, సినీ చరిత్రలోనే తొలిసారిగా డాల్బీ విజన్ సినిమా టెక్నాలజీతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది..అవతార్ ఫైర్ అండ్ యాష్. ఇక ఈ సినిమా రూ.20 వేల కోట్లుకు పైగా కలెక్షన్స్‌ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nelson Dilipkumar: రాజమౌళిని మించి నెల్సన్ మాస్టర్ ప్లాన్.. మళ్లీ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోతో కొత్త సినిమా

Rashmika Mandanna: AI దుర్వినియోగం పై మండిపడ్డ రష్మిక