బెట్టింగ్ యాప్ కేసులో ED ఎంట్రీ! తీవ్ర చిక్కుల్లో ఆ 11 మంది
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారికి మరో బిగ్ ఝలక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు.. సెల్రబిటీలకు ఇచ్చిన డబ్బులు హవాలా ద్వారా స్వదేశంలోకి వచ్చాయని తెలియడంతో... ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇదే ఇప్పుడ సంచలన విషయంగా మారింది. ఈ విషయంగానే బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు.
పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను కూడా ఇదే అంశంపై ప్రశ్నించారు. యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలాంటి నజరానా పొందారనే వివరాలు రాబట్టారు పంజాగుట్ట పోలీసులు. ఈ క్రమంలోనే హీరోయిన్లు హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లూయెన్సర్లపై నిఘా ఉంచారు. హవాలా రూపంలో.. మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో.. బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు ఇన్ఫ్లూయెన్సర్లు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించడంతో పాటు.. టెక్నికల్గానూ వారి లొకేషన్లు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tasty Teja: పోలీసులకు షాకిచ్చిన టేస్టీ తేజ
Nayanthara: దారుణంగా తిట్టి అవమానించాడు…స్టార్ డైరెక్టర్ పై నయన్ తీవ్ర ఆరోపణలు
డ్రగ్స్తో అప్రతిష్ట! షాకింగ్ నిర్ణయం తీసుకున్న హేమ
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా
అంగన్వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్
22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి మృతి.. కారణం ఇదే
గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకుల

