Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్ ఉన్నవారికి అలర్ట్.. ఆ పండ్ల జ్యూస్‌లు అస్సలు తాగొద్దు

డయాబెటిస్ ఉన్నవారికి అలర్ట్.. ఆ పండ్ల జ్యూస్‌లు అస్సలు తాగొద్దు

Phani CH

|

Updated on: Mar 02, 2025 | 7:20 PM

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. డయాబెటిస్ ఉన్న రోగులు తాము తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి.. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగి.. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.. అటువంటి పరిస్థితిలో, మీరు డయాబెటిస్ రోగి అయితే, మీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని మాత్రమే తినాలి.

డయాబెటిక్ రోగులు ఆకు కూరలు, పండ్లు తినమని వైద్యులు సలహా ఇచ్చినప్పటికీ.. డయాబెటిక్ రోగులు జ్యూస్‌లు తాగకుండా ఉండాలి. ఎందుకంటే చాలా పండ్లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జ్యూస్ తాగడం వల్ల చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిక్ రోగులు కొన్ని పండ్ల రసం తాగకుండా ఉండాలని వైద్య నిఫుణులు సూచిస్తున్నారు.. నారింజలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఉదయం నారింజ రసం తాగడానికి ఇష్టపడతారు. నారింజ రసంలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. అదే సమయంలో, మీరు ఒక నారింజ పండును పూర్తిగా తింటే, అందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందువల్ల, దాని రసం తాగే బదులు, మొత్తం నారింజ పండును తినడం మంచిది. పైనాపిల్‌లో సహజ చక్కెర చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనితో పాటు, దాని గ్లైసెమిక్ సూచిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో.. మీరు పైనాపిల్ ను మామూలుగా తింటే మీకు ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డాక్టర్‌ చేయలేనిది.. ఇది చేసేస్తుంది! ఏఐ ఎంట్రీ.. వైద్యరంగంలో గేమ్ ఛేంజరా?

36 పేజీలలో 36 పెళ్లి తంతు వివరాలు ఈ శుభలేఖ వెరీ స్పెషల్‌

తాటి చెట్టు పైకి గీత కార్మికుడు కుండలో కనిపించింది చూసి షాక్