భారత్-పాక్ సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం

పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు వద్ద చైనా డ్రోన్ కనిపించి కలకలం రేపింది. అమృత్‌సర్ జిల్లాలో 500 గ్రాముల హెరాయిన్‌తో కనిపించిన ఈ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ అనుమానిత ప్రదేశాల్లో గాలించగా నిన్న సాయంత్రం 4.45 గంటల సమయంలో డ్రగ్ ప్యాకెట్‌తో ఉన్న ఈ డ్రోన్ కనిపించింది. డ్రోన్‌కు డ్రగ్ ప్యాకెట్, టార్చ్‌లైట్‌ను టేపుతో చుట్టారని అధికారులు తెలిపారు.

భారత్-పాక్ సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం

|

Updated on: Apr 20, 2024 | 9:05 PM

పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు వద్ద చైనా డ్రోన్ కనిపించి కలకలం రేపింది. అమృత్‌సర్ జిల్లాలో 500 గ్రాముల హెరాయిన్‌తో కనిపించిన ఈ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ అనుమానిత ప్రదేశాల్లో గాలించగా నిన్న సాయంత్రం 4.45 గంటల సమయంలో డ్రగ్ ప్యాకెట్‌తో ఉన్న ఈ డ్రోన్ కనిపించింది. డ్రోన్‌కు డ్రగ్ ప్యాకెట్, టార్చ్‌లైట్‌ను టేపుతో చుట్టారని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రోన్ చైనా తయారీ ‘డీజేఐ మావిక్ 3 క్లాసిక్’ అనీ భారత్-పాక్ సరిహద్దులో డ్రోన్లతో డ్రగ్స్ రవాణా చేసే కుట్రకు పాకిస్తాన్‌ పాల్పడుతోందని తెలిపారు. సరిహద్దు వద్ద డ్రోన్ల ద్వారా పాకిస్థాన్‌ దొడ్డిదారిన డ్రగ్స్‌ అక్రమ రవాణాకు తెగబడుతోంది . గతంలో కూడా భారీ ఎత్తున డ్రగ్స్‌ను భారత సరిహద్దు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన 2.6 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది BSF సిబ్బంది. సరిహద్దు ప్రాంతంలో డ్రోన్‌ నుంచి ఈ పార్సిల్‌ను కింద పడేసినట్లు అధికారులు తెలిపారు. చైనా డ్రోన్‌ను గుర్తించిన BSF సిబ్బంది దాన్ని కాల్చివేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా ?? నోస్ట్రడామస్ జోస్యం నిజమవుతుందా ??

TTD: శేషాచలం అడవుల్లో మంటలు.. వీడియో ఇదిగో

ఆసుపత్రిలో నటుడు.. విషం ఇచ్చారని ఆరోపణ

వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్‌.. రాజాసాబ్ వీడియో లీక్

బాలీవుడ్‌లో.. చరణ్‌కు 70 కోట్లు, NTRకి 50 కోట్లు

Follow us