మగువలకు షాక్.. మరింత పెరిగిన బంగారం ధర! వీడియో
బంగారం ధర తగ్గనంటోంది. కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. శుక్రవారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.83 వేలు దాటింది. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి రూ.83,100కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా రూ.200 పెరిగి రూ.82,700కి చేరింది. అటు వెండి సైతం కిలోకు రూ.500 మేర పెరిగింది.
క్రితం ట్రేడింగ్లో రూ.93,500గా ఉన్న వెండి కిలో తాజాగా రూ.94 వేల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయ విపణిలో బంగారం ఔన్సు 2780 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. వెండి 31.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ టారిఫ్ల విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల వేళ ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇతర అంశాల్లోనూ మున్ముందు ఎలా వ్యవహరిస్తారనే దానిపైనా ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని భావిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరుగుతోందన్నారు నిపుణులు. కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు మున్ముందు బులియన్ మార్కెట్లో బంగారం ధర గమనాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
