AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోస్టాఫీసు పథకాల్లో వచ్చిన కొత్త రూల్స్‌ ఏంటో తెలుసా ??

పోస్టాఫీసు పథకాల్లో వచ్చిన కొత్త రూల్స్‌ ఏంటో తెలుసా ??

Phani CH

|

Updated on: Dec 31, 2023 | 7:44 PM

దేశంలో పొదుపును ప్రోత్సహించే ఉద్దేశంతో తపాలా శాఖ అనేక చిన్న మొత్తం పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ పొదుపు పథకాల్లో ఈ ఏడాది కేంద్రం కొన్ని మార్పులు చేపట్టింది. కొన్ని పథకాలపై పెట్టుబడి పరిమితి పెంచడంతో పాటు.. కొత్తగా మరో స్కీమ్‌ను తీసుకొచ్చింది. మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌ పేరుతో 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

దేశంలో పొదుపును ప్రోత్సహించే ఉద్దేశంతో తపాలా శాఖ అనేక చిన్న మొత్తం పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ పొదుపు పథకాల్లో ఈ ఏడాది కేంద్రం కొన్ని మార్పులు చేపట్టింది. కొన్ని పథకాలపై పెట్టుబడి పరిమితి పెంచడంతో పాటు.. కొత్తగా మరో స్కీమ్‌ను తీసుకొచ్చింది. మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌ పేరుతో 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్లపాటు ఇది అందుబాటులో ఉండనుంది. ఈ పథకానికి 7.50 శాతం స్థిర వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది. డిపాజిట్‌పై 2 లక్షల గరిష్ఠ పరిమితి నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో భాగంగా పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (POMIS)లో డిపాజిట్‌ లిమిట్‌ని పెంచారు. గతంలో వ్యక్తిగత ఖాతాల పరిమితి 4 లక్షలుగా ఉండగా.. ఈ ఏడాది దాన్ని 9 లక్షలకు పెంచారు. జాయింట్‌ ఖాతాల పరిమితి 9 లక్షల నుంచి 15 లక్షలకు పెంచారు. ఇక సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS)లో ఒక వ్యక్తి ఇప్పటి వరకు 15 లక్షల వరకు గరిష్ఠ డిపాజిట్‌ చేసే అవకాశం ఉండేది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలిలో వాకింగ్‌కి వెళ్తున్నారా.. జాగ్రత్త..

అరుదైన 2 వేల సాలగ్రామాలతో శ్రీహరి సన్నిధి ప్రతిష్ఠ

జైశ్రీరామ్‌ అంటున్న ముస్లిం యువతి..అయోధ్య వరకు పాదయాత్ర

ఫ్రీగా అయోధ్య హారతి పాసులు.. బుక్‌ చేసుకోండిలా

డిస్కౌంట్‌ ఎఫెక్ట్‌.. ఎగబడి చలాన్లు కడుతున్న జనాలు