Watch: గుంటూరు జిల్లాలో నడిరోడ్డుపై కారు దగ్ధం.. కారులో ఉన్న ముగ్గురు..
ఏసి లోంచి పొగలు వస్తున్నట్టుగా కనిపించటంతో కారులో ఉన్నవారు వెంటనే కిందకు దిగేశారు. ఆ మరుక్షణంలోనే కారులో మంటలు చెలరేగాయని చెప్పారు. స్థానికులు బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. మంటలు అదుపులోకి రాలేదు. కళ్లముందే కారు పూర్తిగా కాలిపోయింది. చివరకు..
బాపట్ల జిల్లాలో నడిరోడ్డుపై కారు దగ్ధమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. వేమూరు నుండి కొల్లూరు వస్తున్న ఇండికా V2 కారు నడిరోడ్డుపైనే మంటల్లో కాలి బూడిదైపోయింది. కారులో ఉన్న ముగ్గురికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఏసి లోంచి పొగలు వస్తున్నట్టుగా కనిపించటంతో కారులో ఉన్నవారు వెంటనే కిందకు దిగేశారు. ఆ మరుక్షణంలోనే కారులో మంటలు చెలరేగాయని చెప్పారు. స్థానికులు బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. మంటలు అదుపులోకి రాలేదు. కళ్లముందే కారు పూర్తిగా కాలిపోయింది. చివరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వైరల్ వీడియోలు
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

