Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: తెల్లారేసరికి అదే పనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని చూడగా

AP News: తెల్లారేసరికి అదే పనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని చూడగా

Ravi Kiran

|

Updated on: Jan 21, 2025 | 12:49 PM

ఆ గ్రామంలో తెల్లవారుజామున అదేపనిగా కుక్కలు అరుస్తూ కనిపించాయి. ఏమి జరిగింది.? అని కొందరు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ఓ కవర్ ఆపరేషన్ చేశారు. ఇంతకీ అదేంటి.? ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి

ఆ గ్రామంలో తెల్లారేసరికి అదేపనిగా కుక్కలు అరుస్తూ కనిపించాయి. ఏమి జరిగింది.? అని కొందరు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ఓ కవర్ ఆపరేషన్ చేశారు. ఇంతకీ అదేంటి.? వివరాల్లోకి వెళ్తే… శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని ఎన్పీ.కుంట మండలంలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన బాలాజీ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కాడు. బాలాజీ నుంచి కిలోల కొద్దీ గంజాయి కొనుగోలు చేస్తున్న ఎన్పీ.కుంటకు చెందిన మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ ముఠా ఎన్పీ.కుంట మండలంలోని గ్రామాల్లో గంజాయి విస్తారంగా అమ్మడానికి ప్లాన్ చేసినట్టుగా డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. నిందితుల వద్ద నుంచి 4.8 కిలోల గంజాయి ఉన్న 12 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. పట్టుబడ్డ తొమ్మిది మంది నిందితులను రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Jan 21, 2025 11:00 AM