Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'కనండి బాబు కనండి.. లోకల్‌ టు గ్లోబల్ సంతానమే ప్రధానం..'

‘కనండి బాబు కనండి.. లోకల్‌ టు గ్లోబల్ సంతానమే ప్రధానం..’

Ravi Kiran

|

Updated on: Jan 20, 2025 | 10:05 PM

సంపాదన చాలదు.. సంతానం కావాలి.. లోకల్‌ టూ గ్లోబల్ సంతానమే ప్రధానం అని అంటున్నారు సీఎం చంద్రబాబు. ఆయనే సంతానానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. సంతానలేమి ప్రపంచవ్యాప్త సమస్యగా మారిందన్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు, సంపాదన బానే ఉంది. జపాన్‌లాంటి దేశం కూడా ఇండియన్స్‌ని అరువు అడుగుతోంది. ఆ పరిస్థితి ఇండియాకు, ఏపీకి రావద్దు.

కనండి బాబు కనండి. జనం లేక ఊసూరమంటున్న దేశాల సరసన మనం కూడా చేరకుండా ఉండాలంటే కనండి బాబు కనండి. 2047 నాటికి ఇండియాను నెంబర్‌ వన్‌గా నిలపాలంటే కనండి బాబు కనండి. సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు.. సంతానం కూడా ప్రధానం కావాలి. అందుకే కనండి బాబు కనండి. దాచేపల్లి నుంచి దావోస్ వరకు.. వేదిక ఏదైనా ఇదే అంశాన్ని గుర్తు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జనాభా పెంచడంపై వ్యాపారవేత్తలు కూడా దృష్టిసారించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా సమస్య ఉంది. జపాన్ లాంటి దేశం కూడా జనాన్ని పంపించమని ఇండియాను అడుగుతోంది. ఎంతో సంపద సృష్టించిన దేశాలు కూడా సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొని కారణంగా జనాభా సమస్యను ఎదుర్కొంటున్నాయి. మనుషులే లేకపోతే అగ్రదేశాలు ఎందుకు 2047 కల్లా ఇండియా అయితే ప్రథమ స్థానం, లేదంటే ద్వితీయ స్థానంలో ఉండబోతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి