AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షలు ఎప్పుడంటే

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షలు ఎప్పుడంటే

Phani CH
|

Updated on: Nov 20, 2025 | 4:12 PM

Share

2026 ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల తేదీల ఖరారుపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మార్చి 16 లేదా 21 నుండి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈసారి దాదాపు 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇన్విజిలేటర్ల నియామకం, పరీక్షా కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత లేని ఉపాధ్యాయులను మినహాయించి, రాష్ట్ర స్థాయి నుంచే ఇన్విజిలేటర్ల ఎంపిక జరుగుతుంది. షెడ్యూల్ డిసెంబర్‌లో విడుదల కానుంది.

ఏపీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 మా­ర్చిలో నిర్వహించనున్నారు. అయితే తేదీల ఖరారుపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. దీంతో విద్యాశాఖ అధికారులు మార్చి 16తో ఒక టైంటేబుల్, మార్చి 21తో మరో టైంటేబుల్‌ రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఈ రెండింటిలో ప్రభుత్వం దేనికి అనుమతి ఇస్తే.. ఆ ప్రకారంగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈలోగా పరీక్షల సిబ్బంది నియామకం, ఇన్విజిలే­టర్ల ఎంపిక, పరీక్ష సెంటర్ల గుర్తింపుపై అధికారులు దృష్టి సారించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.50 లక్షల­మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 3,500 సెంటర్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు 35 వేల­మంది ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించే పనిలో విద్యాశాఖ పడింది. వీరితో పాటు మరో రెండువేల మంది స్క్వాడ్‌ సిబ్బందిని నియమించాల్సి ఉంది. గతేడాది ఇన్విజిలేటర్ల ఎంపికను జిల్లాల్లో చేపట్టగా, ఈసారి రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్‌ నుంచే చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి ఇన్విజిలేటర్ల ఎంపిక కోసం రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీ­లను ఇన్విజిలేటర్లుగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యా­యుల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని డైరెక్టరేట్‌ అధికారులు జిల్లా అధికారు­లను ఆదేశించారు. అయితే వీరిలో గతంలో చార్జి మెమోలు తీసు­కు­న్నవారు, సస్పెన్షన్‌కు గురైనవారు, దీర్ఘకాలిక ఆరో­గ్య సమస్యలున్నవారిని పరీక్ష విధులకు దూ­రం పెట్టాలని విద్యాశాఖ భావిస్తుంది. అలాగే స్కూల్‌ అసిస్టెంట్ల విషయంలోనూ ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు. పరీక్షల సమయంలో సంబంధిత సబ్జెక్టు టీచర్లు పరీక్ష విధులకు హాజరుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలోగా పరీక్షల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వలలో చిక్కిన వయ్యారి చేప.. ఆనందంలో జాలరి

ఢిల్లీ ఎర్రకోట పేలుడు.. సూసైడ్ బాంబర్ షూలోనే ట్రిగ్గర్ ??

పైరసీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే.. ఆ పని చేయాల్సిందే..

అల్లు అర్జున్‌తో పోటీ.. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఏమన్నారు ??

Rajamouli: ఇంటర్నేషనల్‌ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న.. మరీ ఇంత అడ్వాన్స్ గానా