Watch Video: రాజమండ్రిలో ఈయనకు సీటు ఇస్తే ఓటు వేయమంటున్న జనసేన కార్యకర్తలు..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన కార్యాలయంలో కందుల దుర్గేష్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మీటింగ్ అనంతరం బయటికి వచ్చిన జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కందులు దుర్గేష్ కు రాజమండ్రి సీటు ఇవ్వకపోతే తాము పార్టీకి పనిచేసి ప్రయోజనం ఏముందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన కార్యాలయంలో కందుల దుర్గేష్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మీటింగ్ అనంతరం బయటికి వచ్చిన జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కందులు దుర్గేష్ కు రాజమండ్రి సీటు ఇవ్వకపోతే తాము పార్టీకి పనిచేసి ప్రయోజనం ఏముందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా బుచ్చయ్య చౌదరికి సీటు ఇస్తే మాలో ఒక్కరు కూడా ఓటు వేయమని తెగేసి చెప్పారు. కొన్నేళ్ల పాటు జనసేన పార్టీ సిద్ధాంతాలకు దుర్గేష్ కట్టుబడి ఉన్నారన్నారు. నిడదవోలుకు వెళ్లి పోటీ చేయమని చెప్పినట్లు దుర్గేష్ చెప్పారు.
తమ నాయకునికి అన్ని విధాలా సహకరించామని ఉమ్మడి జిల్లా బాధ్యతలు ఇచ్చిన జనసేన పార్టీ.. దుర్గేష్కు రాజమండ్రి రూరల్ సీటు ఇవ్వకపోవడం పార్టీకే చెడ్డ పేరు అన్నారు. పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారని గుర్తుచేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని నమ్ముకుని అన్నీ పోగొట్టుకున్నామని తెలిపారు. ఈసారి కార్యకర్తలుగా తాము రాజకీయ పార్టీలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
