Andhra: వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా
విశాఖ జిల్లా కూర్మన్నపాలెం జంక్షన్లో గంజాయి కలకలం రేపింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి తరలించేందుకు సిద్ధమైన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గంజాయిని బస్తాల్లో నింపి తరలించేందుకు ప్రయత్నించగా.. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేశారు. ఆ వివరాలు
విశాఖ జిల్లా కూర్మన్నపాలెం జంక్షన్లో గంజాయి కలకలం రేపింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి తరలించేందుకు సిద్ధమైన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గంజాయిని బస్తాల్లో నింపి తరలించేందుకు ప్రయత్నించగా.. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేశారు. దాంతో.. 44 బ్యాగుల్లో 100 కిలోల గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో నలుగురు గంజాయి స్మగ్లర్లు పారిపోవడంతో వారి కోసం గాలిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి తరలింపు ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

