ఒక్క పొరపాటు వల్ల.. వచ్చే 75 ఏళ్లలో 58 లక్షల మంది చనిపోతారు!

గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి ఛాలెంజ్‌ విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో తుఫానులు, ఆకస్మిక వరదలు, కరువు కాటకాలు. పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు, కరుగుతున్న మంచు, కార్చిచ్చులు ప్రముఖంగా వార్తల్లో నిలిచాయి. ముఖ్యంగా యూరోప్‌ దేశాలు గత ఐదు శతాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేసవి వేడి గాలులతో అల్లాడిపోయాయి. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ తదితర దేశాల్లో వర్షాలు తగ్గడంతో ప్రముఖ నదుల్లో నీటి మట్టం తగ్గిపోతుంది.

ఒక్క పొరపాటు వల్ల.. వచ్చే 75 ఏళ్లలో 58 లక్షల మంది చనిపోతారు!
Worle Climate Changes
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 28, 2025 | 7:45 PM

క్లైమేట్‌ ఛేంజ్‌ ప్రపంచాన్ని మార్చేస్తోంది. గత కొన్నేళ్లుగా పలు దేశాల్లో అకాల వర్షాలు-వరదలు, తుఫానులు, కరువులు, వేడిగాలులు, కార్చిచ్చు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మనుషులకు సంబంధించి అనేక రకాల అంచనాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. చాలా సార్లు ఈ అంచనాలలో కొన్ని మన ముందు నిజమవుతూనే ఉన్నాయి. అది మనకు మానవులకు భయంకరంగా మారుతుంది. ఈ విషయాలు జ్యోతిష్యం ఆధారంగానే కాకుండా శాస్త్రోక్తంగా కూడా రుజువుతున్నాయి. ఇలాంటి శాస్త్రీయ అంచనా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఆంగ్ల వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురితమైన వార్త ప్రకారం, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధన చేసి ప్రపంచం ముందు ఒక అంచనాను ఉంచింది. 2015 – 2099 మధ్య కాలంలో ఐరోపాలో 58 లక్షల మందికి పైగా చనిపోతారని అందులో వెల్లడించారు. ఇంత పెద్ద విపత్తుకు మనమే కారణమని, ఇది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిదిగా పేర్కొన్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల సంభవించే మరణాల గురించి ఈ పరిశోధన పేర్కొంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని ప్రభావం వేసవిలోనే కాదు చలికాలంలోనూ కనిపిస్తుందట. నివేదిక ప్రకారం, చలి కారణంగా మరణించే వారి కంటే వేడి కారణంగా మరణాల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న వేడికి సంబంధించి ప్రపంచం తక్షణమే చర్యలు తీసుకునేలా ఈ నివేదికను విడుదల చేసినట్లు ఈ పరిశోధన ప్రధాన రచయిత డాక్టర్ పియర్ మస్సెలాట్ తెలిపారు.

వేడి కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించే ప్రదేశం బార్సిలోనా అని, రోమ్, నేపుల్స్, మాడ్రిడ్‌లు దాని తర్వాత చేర్చారు. ఇక్కడ వాతావరణ మార్పుల గరిష్ట ప్రభావం రాబోయే కాలంలో కనిపిస్తుంది అని కూడా ఈ నివేదికలో స్పష్టం చేశారు. ఇది కాకుండా, యూరప్‌లోని మొత్తం 854 నగరాలను ఈ పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని నివేదికలో పేర్కొన్నారు. డాక్టర్ పియరీ మస్సెలాట్ తన పరిశోధన ముగింపులో ఇలా వ్రాశారు. మనం ఇప్పుడు ఈ పనిని ప్రారంభించకపోతే, 5,825,746 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ నివేదిక ప్రకారం, ఈ పరిశోధన యూరప్‌కే కాదు, యావత్ ప్రపంచానికే హెచ్చరికలాంటిదని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్‌ వార్మింగ్‌పై ఇప్పటికే అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.. ఈ వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ సెంటిస్టులు హెచ్చరిస్తున్నారు..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..