Viral Video: క్షణం ఆలస్యం అయితే ప్రాణాలు గాలిలో కలిసేవే.. కదులుతున్న రైలు ఎక్కుతూ ..

ఓ ప్రయాణీకుడు రైలు ఎక్కేందుకు చేసిన ప్రయత్నం ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

Viral Video: క్షణం ఆలస్యం అయితే ప్రాణాలు గాలిలో కలిసేవే.. కదులుతున్న రైలు ఎక్కుతూ ..
Viral Video

Updated on: Sep 12, 2022 | 4:02 PM

Viral Video: కదులుతున్న రైళ్లు నుంచి ప్రయాణీకులు ఎక్కడం, దిగడం ప్రమాదకరం రైల్వే అధికారులు, సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ చాలామంది  ప్రయాణీకులు ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా ఓ ప్రయాణీకుడు రైలు ఎక్కేందుకు చేసిన ప్రయత్నం ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఘజియాబాద్‌లో రైల్వే స్టేషన్​లో ఓ వ్యక్తి  రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ.. పట్టుదప్పి.. జారి పడిపోయాడు.. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు అతడిని రక్షించాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారిపడిన వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. కదులుతున్న పూర్ణగిరి జనశతాబ్ది రైలు ఎక్కేందుకు వ్యక్తి ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన అంతా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

ఇవి కూడా చదవండి

రైల్వే స్టేషన్‌లో సీసీటీవీలో రికార్టైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ASI రాజేంద్ర సింగ్ వేగంగా స్పందించి చాకచక్యంగా ఆ వ్యక్తి ట్రాక్‌ పై పడకుండా కాపాడిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ASI రాజేంద్ర సింగ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us