
కొన్నిసార్లు సముద్రం లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను కూడా తన అలలతో ఒడ్డుకు తీసుకువస్తుంది. ఇటీవల, బ్రిటన్లోని ఓగ్మోర్లోని సీ బీచ్లో ఇలాంటి అంతుచిక్కని దృశ్యం కనిపించింది. ఇది చరిత్రకారులను, స్థానిక ప్రజలను ఆశ్చర్యపరిచింది. అక్కడ వందలాది పాత బూట్లు ఇసుకపై చెల్లాచెదురుగా కనిపించాయి. ఇవి సాధారణ బూట్లు కాదు, విక్టోరియన్ శకం నుండి వచ్చిన నల్ల తోలు బూట్లు. ఇవి దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనవి.
బ్రిటన్లో బీచ్ క్లీనప్ సమయంలో స్వచ్ఛంద సేవకులు చెత్త తొలగింపు పనులు చేస్తుండగా, వారు ప్లాస్టిక్, శిధిలాలను తీసేస్తున్నారు. కానీ, వారి కళ్ళ ముందు 400 కంటే ఎక్కువ నల్ల తోలు బూట్లు, వాటిలో చాలా వరకు హాబ్నెయిల్స్ పొదిగినవి కనిపించాయి.. ఈ బూట్లు కేవలం ఏదో సాధారణ చెత్తకుప్ప కాదని, అవి విక్టోరియన్ కాలం నాటి బూట్లు అని తెలిసింది. అవి దాదాపు 150 సంవత్సరాల నాటివిగా చెబుతున్నారు.
బీచ్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఎమ్మా లాంపోర్ట్ మాట్లాడుతూ, బూట్లు ఫ్రోలిక్ అనే ఓడ నుండి వచ్చాయని, అది 1831లో టస్కర్ రాక్ను ఢీకొని మునిగిపోయిందని బలమైన సిద్ధాంతం ఉందని చెప్పారు. ఆ ఓడ ఇటలీ నుండి బూట్లు, ఇతర సామాగ్రిని తీసుకువెళుతోంది. ఈ ప్రమాదంలో దాదాపు 80 మంది మరణించారు. ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. నది ఒడ్డు కోతకు గురైన ప్రతిసారీ, బూట్లు తిరిగి పైకి వస్తుంటాయని చెప్పారు.
టస్కర్ రాక్.. అంటే ఓడల స్మశానవాటిక అని కూడా పిలుస్తారని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. ఈ రాక్ కారణంగా శతాబ్దాలుగా ఓడలకు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఫ్రోలిక్ నౌక ధ్వంసం తర్వాత నెలల తరబడి, మృతదేహాలు, వస్తువులు ఒడ్డుకు కొట్టుకువచ్చాయని చెప్పారు. ఇప్పుడు, 150 సంవత్సరాల తరువాత, సముద్రం మరోసారి చాలా కాలంగా మరచిపోయిన విషాద జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది. చరిత్రకారులకు ఈ ఆవిష్కరణ అమూల్యమైన నిధి వంటిది. ఎందుకంటే సముద్రం నుండి వెలికితీసిన ప్రతి షూ ఒక కథను చెబుతుంది. ఓడ, దాని ప్రయాణీకులు, సముద్రం వాణిజ్యానికి ప్రధాన మార్గంగా ఉన్న కాలం గురించి మరింతగా తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది.
బీచ్ అకాడమీ బృందం ఈ చారిత్రక వస్తువులను సంరక్షించడమే కాకుండా, బీచ్ను దాని సహజ స్థితికి పునరుద్ధరించడానికి కూడా కృషి చేస్తోంది. తన బృందం ఇప్పటివరకు 12,000 కంటే ఎక్కువ సముద్రపు చెత్తను తొలగించిందని ఎమ్మా వివరించారు. రాక్పూల్ ఆవాసాలను పునరుద్ధరించడమే వారి లక్ష్యం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…