AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి టార్చ్ వేసి ట్రాక్‌పై పరుగులు.. రైలులో నుంచి కుప్పలు తెప్పలుగా..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో అర్థరాత్రి, అకస్మాత్తుగా రైలు నుంచి డబ్బులు గాలిలో ఎగురుతూ కింద పడడం ప్రారంభించాయి. రైలులో కూర్చున్న ఒక వ్యక్తి పెద్ద బ్యాగ్‌లో నింపిన నోట్లను కిటికీ గుండా గాల్లోకి విసిరేయడం ప్రారంభించాడని చెబుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. నోట్లు నేలపై పడగానే.. వాటిని తీసుకోవడానికి ప్రజలు పరిగెత్తారు. ఇలా స్థానికులు రాత్రంతా డబ్బులు కోసం వెదుకుతూనే ఉన్నారు.

అర్ధరాత్రి టార్చ్ వేసి ట్రాక్‌పై పరుగులు.. రైలులో నుంచి కుప్పలు తెప్పలుగా..
500 Rupee Notes Suddenly Fell From Moving Train
Surya Kala
|

Updated on: Sep 17, 2025 | 1:22 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వింతైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి లక్నో నుంచి బరేలీకి వెళ్తున్న రైలు నుంచి అకస్మాత్తుగా 500 , 100 రూపాయల నోట్ల వర్షం కురిసింది. దీనిని చూసిన వెంటనే ప్రజలు అక్కడికి చేరుకున్నారు. రాత్రి కావడంతో ప్రజలు తమ మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించి నోట్ల కోసం వెతికారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి కొద్దిసేపటికే రైల్వే ట్రాక్‌పై భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. ఆ దృశ్యం ఏదో సినిమాలోని దృశ్యంలా కనిపించింది.

రైలులో ఉన్న ఒక వ్యక్తి కరెన్సీ నోట్లతో నిండిన పెద్ద బ్యాగు నుంచి నోట్లు తీసి కిటికీ గుండా గాల్లోకి విసిరేయడం ప్రారంభించాడని చెబుతున్నారు. ఫరీద్‌పూర్ స్టేషన్ సమీపంలోని నివాసితులు అకస్మాత్తుగా ఆకాశం నుంచి డబ్బు వర్షం కురుస్తున్నట్లు అనిపించిందని చెబుతున్నారు. మొదట్లో ఏమిటో అర్ధం కాక ప్రజలు అయోమయానికి గురయ్యారు. అయితే వాటిని దగ్గరగా పరిశీలించినప్పుడు.. అవి రూ. 100 , రూ. 500 (డినామినేషన్ నోట్లు) నోట్లు అని వారు గ్రహించారు. ఆ తర్వాత అందరూ ఆ డబ్బులు తీసుకోవడానికి రైల్వే పట్టాల వద్దకు పరిగెత్తారు.

దీంతో అక్కడ రాత్రి సమయంలో వాతావరణం మరింత వింతగా మారింది. ఎందుకంటే ప్రజలు మొబైల్ ఫోన్ లైట్లు ఉపయోగించి చీకటిలో నోట్ల కోసం వెతికారు. కొందరు తమ ఇళ్ల నుంచి టార్చిలైట్లను కూడా తీసుకుని వెళ్లి నోట్ల కోసం వేట మొదలు పెట్టారు. ఆ నోట్లు నిజమైనవని ప్రజలు చెబుతున్నారు. అయితే ఇవి నిజమైనవా లేదా నకిలీవా అనే దానిపై అధికారిక నిర్ధారణ ఇంకా జరగలేదు.

ఇవి కూడా చదవండి

ఆ వీడియో వైరల్ అయింది, పరిపాలన కూడా ఆశ్చర్యపోయింది.

ఈ సంఘటనకు సంబంధించిన వైరల్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో విస్తృత చర్చకు దారితీసింది. ఈ సంఘటన గురించి తనకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని ఫరీద్‌పూర్ ఇన్‌స్పెక్టర్ రాధేశ్యామ్ పేర్కొన్నారు. అయితే తనకు ప్రజల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సరైన సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది

ఈ మొత్తం సంఘటన ఆ ప్రాంతంలో అనేక ప్రశ్నలను లేవనెత్తింది. రైలు నుంచి నోట్లను విసిరిన వ్యక్తి ఎవరు? అతనికి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అతను డబ్బును దాచిన డబ్బుని ఇలా విసిరేశాడా? లేక మరేదైనా కారణం వల్లనా? వంటి అనేక సమాధానం లేని ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఉదయిస్తున్నాయి.

తాము ఇలాంటి దృశ్యాన్ని తాము మొదటిసారి చూశామని ప్రజలు అంటున్నారు. కరెన్సీ నోట్ల కోసం జరిగిన గొడవ రైల్వే ట్రాక్‌లపై జనసమూహాన్ని రేకెత్తించింది. ఈ సమయంలో అవాంఛనీయమైన ఏమీ జరగకపోవడం కొంత మేర ఉపశమనం ఇచ్చింది అంటున్నారు రిల్వే అధికారులు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..