AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పైకేమో అది ఓవర్ ‌హెడ్ వాటర్ ట్యాంక్‌.. తీరా ఓపెన్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్.!

ఆ రోజు సెలవు కావడంతో ఇద్దరు పిల్లలు ఎంచక్కా ఆటాడుకుంటున్నారు. ఆడుకుంటున్న సమయంలో వారిద్దరూ అనుకోకుండా ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఇక అక్కడ చూసిన ఊహించని దృశ్యానికి ఆ ఇద్దరు పిల్లలు దెబ్బకు కంగుతిన్నారు. సీన్ కట్ చేస్తే..! ఇంతకీ అదేంటి.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దామా..!

Viral: పైకేమో అది ఓవర్ ‌హెడ్ వాటర్ ట్యాంక్‌.. తీరా ఓపెన్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్.!
Over Head Water Tank
Ravi Kiran
|

Updated on: Nov 22, 2023 | 5:17 PM

Share

ఆ రోజు సెలవు కావడంతో ఇద్దరు పిల్లలు ఎంచక్కా ఆటాడుకుంటున్నారు. ఆడుకుంటున్న సమయంలో వారిద్దరూ అనుకోకుండా ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఇక అక్కడ చూసిన ఊహించని దృశ్యానికి ఆ ఇద్దరు పిల్లలు దెబ్బకు కంగుతిన్నారు. సీన్ కట్ చేస్తే..! పోలీసులు రంగంలో దిగారు.. దర్యాప్తును ప్రారంభించడంతో ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అదేంటి.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దామా..!

వివరాల్లోకి వెళ్తే.. జాజ్‌పూర్‌ సదర్ బ్లాక్‌లోని నిశ్చింత గ్రామ శివార్లలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌లో రెండు ఆస్థి పంజరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అవి ఇద్దరు మనుషులవిగా ఖాకీలు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆస్థి పంజరాలను పోస్టుమార్టం నిమిత్తం జాజ్‌పూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించి.. ఈ అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సోమవారం ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా.. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఈ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌లో ఆస్థి పంజరాలను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ వార్త స్థానికులకు తెలియడంతో క్షణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది. సమాచారం అందుకోగానే జాజ్‌పూర్ ఎస్పీ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆస్థి పంజరాలు లభించిన స్థలం ఊరికి శివార్లలో ఉండటం వల్ల అసాంఘిక కార్యక్రమాలు తరచూ జరుగుతుండేవని.. స్థానికులు ఎస్పీతో చెప్పారు. ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న పుర్రెలు పరిమాణంలో చిన్నవి కావడంతో, అస్థిపంజరాలు కోతులవై ఉండొచ్చునని పోలీసులు ప్రాధమిక విచారణలో భావిస్తున్నారు. ఆ కోణంలోనూ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..