Viral News: ఆ కొలనులో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు.. ఒక్కసారి స్నానం చేస్తే రోగాలు మాయం..!

|

Mar 29, 2021 | 1:12 PM

Viral News Latest: ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ సామాన్య ప్రజలకు పరిష్కారం దొరకని పజిల్స్‌గా మిగిలిపోయాయి.

Viral News: ఆ కొలనులో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు.. ఒక్కసారి స్నానం చేస్తే రోగాలు మాయం..!
Nature Water
Follow us on

Viral News Latest: ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ సామాన్య ప్రజలకు పరిష్కారం దొరకని పజిల్స్‌గా మిగిలిపోయాయి. కొంతమంది శాస్త్రవేత్తలకు కూడా ఇవి తలనొప్పిగా మారాయి. మరి అలాంటి వాటిల్లో ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇదొక మర్మమైన ప్రదేశం.. దాని హిస్టరీ తెలుసుకుంటే మీరూ ఆశ్చర్యపోతారు. అదే టర్కీలోని పాముక్కలే కొండలపై ఉన్న ‘వేడి నీటి గుండాలు’. ఏంటి సహజ వేడి నీటి గుండాల గురించి చెబుతున్నానని అనుకోవద్దు. ఈ ప్రదేశంలోని నీరు దానంతట అదే వేడిగా మారుతుంది. ఇప్పటివరకూ ఆ పజిల్‌ను ఎవరూ కనుక్కోలేకపోయారు.

ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది పర్యాటకుల రాక…

పాముక్కలే కొండలపై ఉన్న వేడి నీటి గుండాలు ఎన్నో సంవత్సరాల నాటివని చెబుతుంటారు. అక్కడి జలపాతంలోని నీటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల నుండి 100 డిగ్రీల మధ్య ఉంటుందని సమాచారం. ఈ సహజ నీటి కొలనులో స్నానం చేయడం వల్ల అనేక వ్యాధులు, ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు నయం అవుతాయని అక్కడి వారి భావన.

ఈ కారణంగా, పర్యాటకులకు ఇది ఫస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతోంది. ఈ వేడి నీటి గుండాలను చూసేందుకు ప్రతీ సంవత్సరం మిలియన్లలో పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుండి వస్తుంటారు. ఈ జలపాతం వెనుక అనేక రహస్యాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలు, సామాన్య ప్రజలకు అంతుచిక్కడం లేదు. ఈ జలపాతంలోని నీటి గురించి ఇప్పటికీ శాస్త్రీయ పరిశోధనలు చాలాసార్లు జరిగాయి. వాటి ప్రకారం, ఇక్కడ నీటిలో ఉన్న ఖనిజాల బాహ్య పరిచయం వల్ల కాల్షియం కార్బోనేట్ ఏర్పడిందని అంటున్నారు.

Also Read:

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!