Watch: షూటింగ్ సైట్‌కి పిల్లలతో వచ్చిన చిరుతపులి…! ఫిల్మీం సిటీలో కలకలం.. షాకింగ్ వీడియో వైరల్‌..

|

Jul 28, 2023 | 8:23 AM

ఇక్కడ గతంలో కూడా చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఈ స్థలం అటవీ ప్రాంతంలోకి రానప్పటికీ ఇప్పుడు చిరుతపులి సంచారం ఎందుకు పెరిగిపోయిందో చాలామందికి అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే సినీ పరిశ్రమలోని 1000 మందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగడం ఖాయమన్నారు.

Watch: షూటింగ్ సైట్‌కి పిల్లలతో వచ్చిన చిరుతపులి...! ఫిల్మీం సిటీలో కలకలం.. షాకింగ్ వీడియో వైరల్‌..
Leopard
Follow us on

ఓ చిరుత తన పిల్లలతో షూటింగ్ సెట్‌లోకి ప్రవేశించింది. దాంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ ఘటన ముంబయిలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో చోటు చేసుకుంది. ఫిల్మీం సిటీలో ఓ సీరియల్ షూటింగ్ జరుగుతుండగా చిరుత తన పిల్లలతో కలిసి ప్రాంగణంలోకి ప్రవేశించింది. ఈ షాకింగ్ వీడియో అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. ముంబైలోని గోరెగావ్ ఫిల్మ్ సిటీలో మరాఠీ సీరియల్ ‘శుక్ మహంజే నహీ కై అస్త్ర’ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు సినిమా తీస్తున్న వాళ్లకి ఓ షాకింగ్‌ సీన్‌ కనిపించింది. ఓ చిరుతపులి తన పిల్లలతో షూటింగ్ సైట్‌కి రావడం చూసి వెంటనే కేకలు వేస్తూ పరుగులు తీశారు.

షూటింగ్‌లో పాల్గొన్న వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. జూలై 26న కోరెగావ్ ఫిల్మ్ సిటీలో మరాఠీ సీరియల్ షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్‌లో 200 మందికి పైగా పాల్గొన్నారు. ఈ క్రమంలో 4 గంటల సమయంలో ఓ చిరుతపులి తన పిల్లలతో కలిసి షూటింగ్ సైట్‌లోకి ప్రవేశించింది. విడుదలైన వీడియోలో ఇది చూసిన వారంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఈ వీడియోను స్మాల్ స్క్రీన్ యాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామలాల్ గుప్తా షేర్ చేశారు.

ఈ ట్వీట్‌ను పోస్ట్ చేసిన అనంతరం.. గత 10 రోజుల్లోనే ఇలాంటి 4-5 ఘటనలు జరిగాయన్నారు. షూటింగ్‌కి వచ్చే వారు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూడా సురేష్ అన్నారు. రోజురోజుకూ ఇదే సమస్య ఎదురవుతున్నదని సురేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే సినీ పరిశ్రమలోని 1000 మందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగడం ఖాయమన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నెల18న కూడా ఇదే తరహాలో షూటింగ్ జరిగింది. అప్పుడు కూడా చిరుతపులి సంచారాన్ని గుర్తించారు. ఆ సమయంలో షూటింగ్ సైట్‌లో 200 మందికి పైగా ఉన్నారు. ఆ రోజు అక్కడే ఉన్న ఓ కుక్కపై చిరుతపులి దాడి చేసిందని సమాచారం. ఇకపోతే, ఈ ఫిల్మీం సిటీ ఉన్న ప్రదేశం సంజయ్ గాంధీ పార్క్ సమీపంలో ఉంది. ఇక్కడ గతంలో కూడా చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఈ స్థలం అటవీ ప్రాంతంలోకి రానప్పటికీ ఇప్పుడు చిరుతపులి సంచారం ఎందుకు పెరిగిపోయిందో చాలామందికి అర్థం కావడం లేదని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..