బాబోయ్‌.. జేసీబీ విధ్వంసమంటే ఇదే మరీ..! రైలు పట్టాలను సైతం వదలకుండా ఇలా..

|

Sep 09, 2024 | 9:41 PM

దూరం నుంచి ఆ ట్రాక్‌ మీదుగా వాహనం రావడం కనిపించింది. అది కెమెరా ఫోకస్‌లోకి రాగానే అది జేసీబీ మెషిన్ అని స్పష్టమవుతుంది. ఈ విధ్వంసక వాహనం రైలు పట్టాలపైకి ఎలా వచ్చిందన్నది మదిలో మెదిలే మొదటి ప్రశ్న. ఎలాంటి మార్పులు లేకుండా ఇరుకైన ఇనుప పట్టాలపై ఈ జేసీబీ ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలకు..

బాబోయ్‌.. జేసీబీ విధ్వంసమంటే ఇదే మరీ..! రైలు పట్టాలను సైతం వదలకుండా ఇలా..
Jcb Runs On Railway Tracks
Follow us on

రైలు ట్రాక్‌పై ట్రైన్‌ నడవాలంటే.. ట్రాక్‌లను సరిగ్గా పట్టుకోగలిగేందుకు వీలుగా ప్రత్యేకమైన చక్రాలు ఉండాలి. అయితే రైలు పట్టాలపై రోడ్డు మీద నడిచే వాహనాన్ని నడిపితే ఏం జరుగుతుందో ఊహించండి.? ఇదేంటి.. అదేలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు కదా..? దీనిపై ఎక్కువ స్ట్రెస్‌ తీసుకోకండి..ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్‌నెట్‌లో వేగంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీ సందేహాలన్నీ తీరిపోతాయి. అదేంటంటే.. రైల్వే ట్రాక్‌లపై జేసీబీ వాహనం పరుగులు పెట్టింది. ఇందుకోసం జేసీబీ వీల్స్‌లో ఎలాంటి మార్పు చేయలదు. వీడియో చూస్తే నిజంగానే షాక్‌ అవుతారు..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను చూస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. వీడియోలో బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. దూరం నుంచి ఆ ట్రాక్‌ మీదుగా వాహనం రావడం కనిపించింది. అది కెమెరా ఫోకస్‌లోకి రాగానే అది జేసీబీ మెషిన్ అని స్పష్టమవుతుంది. ఈ విధ్వంసక వాహనం రైలు పట్టాలపైకి ఎలా వచ్చిందన్నది మదిలో మెదిలే మొదటి ప్రశ్న. ఎలాంటి మార్పులు లేకుండా ఇరుకైన ఇనుప పట్టాలపై ఈ జేసీబీ ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలకు JCB డ్రైవర్ లేదా వీడియో షూట్ చేసే వ్యక్తి సమాధానం ఇవ్వగలరు. ఇది సాధ్యమేనా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టడం తప్ప.!

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

రైల్వే ట్రాక్‌లపై రబ్బరు చక్రాలు ఎలా నడపాలి అని ఓ వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో వైరల్ వీడియోపై నెటిజన్లు భారీగా కామెంట్లు చేస్తున్నారు. మరో వ్యక్తి డ్రైవర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఒక నెటిజన్ ఇలా వ్రాశాడు – ఇది సరికొత్త లాంచ్. వీడియో ఎక్కడిది, దీన్ని చేయడానికి ముందు రైల్వే నుండి అనుమతి తీసుకోవాలి.. ఈ ట్రాక్‌పైకి అకస్మాత్తుగా రైలు వచ్చి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. వీడియో వైరల్ అవుతున్నప్పటికీ, రైల్వేలు ప్రజల ఆస్తి, ప్రజా సంక్షేమ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..