AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈ సాధువు శరీరం 450 ఏళ్లుగా భద్రం.. నేటికీ రక్తస్రావం, పెరిగే గోర్లు.. మనదేశంలోనే

ఈ మృతదేహం ఫ్రాన్సిస్ జేవియర్‌కు చెందినది. అతను భారతదేశంలో క్రైస్తవ మత స్థాపన ప్రసిద్ధి చెందాడు. అతను 7 ఏప్రిల్ 1506 AD స్పెయిన్‌లో జన్మించాడు. గోవాను ఆయన పరిపాలిస్తున్న సమయంలో పోర్చుగీసు వారు ఆయనను సాధువుగా చేశారని చెబుతారు. వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయాలని కోరారు.

Viral News: ఈ సాధువు శరీరం 450 ఏళ్లుగా భద్రం.. నేటికీ రక్తస్రావం, పెరిగే గోర్లు.. మనదేశంలోనే
Saint Francis XavierImage Credit source: Freepik
Follow us
Surya Kala

|

Updated on: Aug 13, 2023 | 1:49 PM

ప్రపంచవ్యాప్తంగా అనేక రహస్యాలు ఇప్పటికీ ఛేదించబడలేదు. ఆ మిస్టరీలను ఛేదించడానికి చాలాసార్లు ప్రయత్నించారు. అయితే అతి తక్కువ విషయాలను .. అతి కొద్దీ మంది మాత్రమే మిస్టరీల హిస్టరీకి కనిపెట్టారు.. విజయం సాధించి చరిత్రలో తమ పేరు లిఖించుకున్నారు. అయితే మానవ మేథస్సుకు అందని ఒక రహస్యం భారతదేశం నడిబొడ్డున కూడా దాగి ఉంది. నిజానికి గోవా రాష్ట్రంలో మిస్టరీ చర్చి ఉంది. 450 ఏళ్లుగా మృత దేహాన్ని ఎక్కడ ఉంచినా ఆ మృతదేహం ఇంకా కుళ్లిపోకుండా ఉండడం ఆశ్చర్యకరం.  నేటికీ డెడ్ బాడీ నుంచి రక్తం వస్తుందని, గోళ్లు సాధారణ మనుషుల్లాగే పెరుగుతాయని ఈ మృతదేహం  గురించి చెబుతారు. ఈ మృత దేహం గురించి తెలుసుకుందాం..

నివేదిక ప్రకారం ఈ మృతదేహం ఫ్రాన్సిస్ జేవియర్‌కు చెందినది. అతను భారతదేశంలో క్రైస్తవ మత స్థాపన ప్రసిద్ధి చెందాడు. అతను 7 ఏప్రిల్ 1506 AD స్పెయిన్‌లో జన్మించాడు. గోవాను ఆయన పరిపాలిస్తున్న సమయంలో పోర్చుగీసు వారు ఆయనను సాధువుగా చేశారని చెబుతారు. వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయాలని కోరారు.

ఎందుకు ఖననం చేయలేదంటే?

ఫ్రాన్సిస్ జేవియర్‌ తనకు ఇచ్చిన పనిని చాలా బాగా చేసాడు. అనేక మందిని తమ మతం అనుసరించే విధంగా శిష్యులను తయారు చేశాడు. అనేక మంది అతనిని చివరి వరకు అనుసరించారు. సెయింట్ జేవియర్ కేవలం పది సంవత్సరాల మిషనరీ కాలంలో 52 వేర్వేరు రాష్ట్రాల్లో యేసుక్రీస్తును గురించి బోధించాడు, తొమ్మిది వేల మైళ్ల ప్రాంతంలో క్రీస్తు బోధనలను ప్రజలు చేరవేశారు. లక్షలాది మంది ప్రజలను యేసుక్రీస్తు శిష్యులను చేసాడు. భారతదేశంలోనే కాదు, చైనా, జపాన్ సహా చుట్టుపక్కల దేశాలలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేశాడు. చైనాకు వెళ్తూ సముద్ర ప్రయాణం చేసే సమయంలో ఆయన మరణించారని చెబుతారు.

ఇవి కూడా చదవండి

అయితే తాను మరణిస్తే తన మృతదేహాన్ని గోవాలో ఖననం చేయాలని ఫ్రాన్సిస్ జేవియర్‌ ముందే శిష్యులకు చెప్పాడట. వందల సంవత్సరాల క్రితం ఒక మహిళ తాను ఒకసారి సెయింట్ జేవియర్ పాదాలలో సూదిని గుచ్చునట్లు, అప్పుడు అక్కడ నుండి రక్తం రావడం ప్రారంభించిందని పేర్కొంది. అతని మృతదేహాన్ని ఉంచిన చర్చి సుమారు 450 సంవత్సరాల నాటిది.  ప్రతి పదేళ్లకు అతని ‘శరీరాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. ఈ సమయంలో మృత దేహానికి పెరిగిన గోర్లు కత్తిరిస్తారు. అంతేకాదు ఫ్రాన్సిస్ జేవియర్‌ మృతదేహాన్ని చూడడానికి  ప్రపంచం నలుమూలల నుండి క్రైస్తవులు బృందాలుగా వస్తారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..