AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముందే కూసిన ‘కోయిల’.. నిజమేనా..?

హిమాలయ పర్వతాల్లో ప్రతి ఏటా వెలిసే స్వయంభూ మంచు లింగం అనూహ్యంగా రెండు నెలలకు ముందే మంచులింగం వెలిసిందా..? ఎస్ఏఎస్బీ అధికారుల కంటే ముందుగానే ఎనిమిది మంది అమర్‌నాథ్‌ను దర్శించుకున్నారు..? వారు షేర్ చేసిన ఫొటోలలో ఇప్పటివేనా..? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 20-25 మధ్య ఎనిమిది మందితో కూడిన తమ బృందం అమరనాథ్‌కు వెళ్లామని, అక్కడ తమకు 15 అడుగుల ఎత్తైన హిమలింగం కనిపించిందని తెలిపారు ఈ బృందంలోని […]

ముందే కూసిన ‘కోయిల’.. నిజమేనా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 29, 2019 | 5:00 PM

Share

హిమాలయ పర్వతాల్లో ప్రతి ఏటా వెలిసే స్వయంభూ మంచు లింగం అనూహ్యంగా రెండు నెలలకు ముందే మంచులింగం వెలిసిందా..? ఎస్ఏఎస్బీ అధికారుల కంటే ముందుగానే ఎనిమిది మంది అమర్‌నాథ్‌ను దర్శించుకున్నారు..? వారు షేర్ చేసిన ఫొటోలలో ఇప్పటివేనా..? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 20-25 మధ్య ఎనిమిది మందితో కూడిన తమ బృందం అమరనాథ్‌కు వెళ్లామని, అక్కడ తమకు 15 అడుగుల ఎత్తైన హిమలింగం కనిపించిందని తెలిపారు ఈ బృందంలోని సభ్యులు. పైగా దానికి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేస్తూ.. ఈ సంవత్సరం తొలిసారిగా స్వామి వారిని దర్శించుకున్నది తామేనని చెప్పారు. అయితే ఈ యాత్రను ప్రతి సంవత్సరం ఎస్ఏఎస్బీ(శ్రీ అమర్ నాథ్ జీ షరైన్ బోర్డ్) నిర్వహిస్తోంది. ఆ సంస్థ అధికారులే ఇంతవరకు గుహను సందర్శించలేదు. దీంతో ఈ ఎనిమిది మంది చెబుతున్నట్టు వీరి అమర్‌నాథ్ యాత్రపైనా, తాము స్వయంభూ మంచులింగాన్ని చూశామంటూ చేసిన ప్రకటనపైనా ఎలాంటి ధ్రువీకరణ రావడం లేదు.

కాగా 46రోజుల పాటు సాగే అమర్ నాథ్ యాత్ర.. ఈ సంవత్సరం జూలై1న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 2 నుంచే మొదలయ్యాయి. పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో రోజుకు 7,500మంది యాత్రికులను ఈ సంవత్సరం అమర్‌ నాథ్‌కు చేరుస్తామని అధికారులు అంటున్నారు.