AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో ఈ సీసీ కెమెరాకు చిక్కారంటే.. మీ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం బట్టబయలు!

చైనా నిఘా వ్యవస్థ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది, కానీ ఈసారి విషయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనను కవర్ చేయడానికి బీజింగ్‌కు వెళ్లిన ఒక జర్నలిస్ట్, అక్కడి నిఘా గోడలు కేవలం వినడమే కాకుండా, రోజుకు 24 గంటలూ గమనిస్తూ ఉంటాయని గ్రహించలేదు. రిపోర్టింగ్ సమయంలో అతని కారు తప్పు చోట ఆగగానే, అతని మొబైల్ ఫోన్‌కు చలాన్ మెసేజ్ వచ్చింది. చైనాలో నిఘా వ్యవస్థ (Surveillance System) ఎంత పటిష్టంగా ఉందో తెలియజేసే వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఓరీ దేవుడో ఈ సీసీ కెమెరాకు చిక్కారంటే.. మీ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం బట్టబయలు!
Facial Recognition Cameras
Jyothi Gadda
|

Updated on: May 15, 2026 | 11:12 AM

Share

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో చైనా ప్రపంచ దేశాల కంటే ఒక అడుగు ముందే ఉంటుంది. చైనా రాజధాని బీజింగ్‌లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన నిఘా వ్యవస్థ ఏ స్థాయిలో పనిచేస్తుందో చూసి ప్రపంచం విస్తుపోతోంది. ముఖ్యంగా తన పౌరులపై నిఘా ఉంచే విషయంలో ఆ దేశం అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలను వాడుతోంది. తాజాగా ఒక అమెరికన్ జర్నలిస్ట్‌కు ఎదురైన అనుభవం చైనా నిఘా వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందో మరోసారి నిరూపించింది.

అసలు ఏం జరిగింది?

బీజింగ్‌లో పర్యటిస్తున్న ఒక అమెరికన్ జర్నలిస్ట్ అనుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. ఆయన ఒక రోడ్డును దాటుతున్నప్పుడు సిగ్నల్ నియమాలను పాటించలేదు. సాధారణంగా ఇతర దేశాల్లో అయితే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను పోలీసులు గమనిస్తేనే చర్యలు తీసుకుంటారు. కానీ చైనాలో పరిస్థితి వేరు. ఆయన రోడ్డు దాటిన కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆయన మొబైల్ ఫోన్‌కు జరిమానా చెల్లించాలంటూ మెసేజ్‌ వచ్చింది.

ఇవి కూడా చదవండి

చైనా అంతటా లక్షలాది ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు వ్యక్తుల ముఖాలను గుర్తించడమే కాకుండా, వారి డేటాబేస్‌తో అనుసంధానమై ఉంటాయి. సదరు జర్నలిస్ట్ తప్పు చేసిన వెంటనే, అక్కడి కెమెరాలు ఆయన ముఖాన్ని స్కాన్ చేసి, ఆయన గుర్తింపును, మొబైల్ నంబర్‌ను క్షణాల్లో కనుగొన్నాయి. దీనివల్ల ఎటువంటి పోలీసు ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ గా జరిమానా నోటీసు జారీ చేయబడింది.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నేరాలను అరికట్టడానికి, క్రమశిక్షణకు ఇలాంటి వ్యవస్థ అవసరమని అంటుంటే, మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని అభిప్రాయపడుతున్నారు. ప్రతి అడుగును ప్రభుత్వం పర్యవేక్షించడం ఆందోళనకరమని మేధావులు పేర్కొంటున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఏది ఏమైనా చైనా తన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ద్వారా పౌరుల ప్రతి కదలికను పర్యవేక్షిస్తోంది. ఈ సంఘటన ద్వారా చైనా టెక్నాలజీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో మనకు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో మిగిలిన దేశాలు కూడా ఇటువంటి కఠినమైన నిఘా వ్యవస్థలను అవలంబిస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ సీసీ కెమెరాకు చిక్కారంటే,మీ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం బట్టబయలు
ఈ సీసీ కెమెరాకు చిక్కారంటే,మీ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం బట్టబయలు
నెయ్యి, యాలకుల సువాసనతో నోట్లో కరిగిపోయే అరటిపండు హల్వా..
నెయ్యి, యాలకుల సువాసనతో నోట్లో కరిగిపోయే అరటిపండు హల్వా..
మీ పిల్లలు చెడు స్నేహం చేస్తుంటే ఇలా కంట్రోల్‌లోకి తెచ్చుకోండి
మీ పిల్లలు చెడు స్నేహం చేస్తుంటే ఇలా కంట్రోల్‌లోకి తెచ్చుకోండి
మనల్ని చూసి అసూయపడే వారిని ఎలా దెబ్బ కొట్టాలి?
మనల్ని చూసి అసూయపడే వారిని ఎలా దెబ్బ కొట్టాలి?
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. IMDBలో 7.1 రేటింగ్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. IMDBలో 7.1 రేటింగ్
భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్న 5 ప్రధాన శత్రువులు ఇవే..
భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్న 5 ప్రధాన శత్రువులు ఇవే..
మరణానికి, పితృలోకానికి.. కాకులు ఎలా వారధులుగా మారాయో తెలుసా?
మరణానికి, పితృలోకానికి.. కాకులు ఎలా వారధులుగా మారాయో తెలుసా?
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
ఒంటి నొప్పులను మాయం చేసే మినపప్పు పాయసం..
ఒంటి నొప్పులను మాయం చేసే మినపప్పు పాయసం..
అక్షర్ కెప్టెన్సీకి ఎసరు.. ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ మొత్తం అవుట్?
అక్షర్ కెప్టెన్సీకి ఎసరు.. ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ మొత్తం అవుట్?