షాకింగ్ న్యూస్.. 37 ఏళ్లుగా కుళ్లిపోని మానవ మృతదేహం లభ్యం..! ఎక్కడ..ఎలాగో తెలుసా..?
సెప్టెంబరు 1986లో అదృశ్యమైన 38 ఏళ్ల జర్మన్ జాతీయుడి మృతదేహం ఇప్పుడు గుర్తించినట్టుగా సంబంధిత అధికారులు తెలిపారు. ఆ సమయంలో అతడు కనిపించకుండా పోవడంతో గాలింపు ముమ్మరం చేశారు. అయితే, చాలా రోజుల వరకు కూడా అతని మృతదేహం లభ్యం కాకపోవడంతో వెతకడం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో 37 ఏళ్ల తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది.
![షాకింగ్ న్యూస్.. 37 ఏళ్లుగా కుళ్లిపోని మానవ మృతదేహం లభ్యం..! ఎక్కడ..ఎలాగో తెలుసా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/missing-hikers.jpg?w=1280)
పర్వతారోహణ అనేది ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన, ప్రమాదకరమైన క్రీడలలో ఒకటి. ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన, ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించడం ఒక విజయం. సముద్ర మట్టానికి అనేక వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వత శిఖరాలు ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. అటువంటి ఉపఉష్ణమండల పరిస్థితుల్లో ట్రెక్కింగ్ చాలా సవాలుగా ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ఆరోగ్య సమస్యలు మొదలైన వాటి వల్ల ట్రెక్కర్లు కూడా మరణిస్తారు. అలా చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కిందకు దించడం కష్టం. మృతదేహాన్ని అక్కడే వదిలేయడం ఆనవాయితీ. 37 ఏళ్లుగా మంచులో పాతిపెట్టిన మృతదేహం ఇప్పుడు లభ్యమైంది. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ఆరోగ్య సమస్యలు మొదలైన వాటి వల్ల ట్రెక్కర్లు కూడా మరణిస్తారు. అలా చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కిందకు దించడం కష్టం. మృతదేహాన్ని అక్కడే వదిలేయడం ఆనవాయితీ. 37 ఏళ్లుగా మంచులో పాతిపెట్టిన మృతదేహం ఇప్పుడు లభ్యమైంది.
నైరుతి స్విట్జర్లాండ్లోని ప్రసిద్ధ మాటర్హార్న్ శిఖరానికి ఆగ్నేయంగా ఉన్న హిమానీనదంపై మృతదేహం లభించింది. శరీరం ఏ మాత్రం కుళ్లిపోలేదు. 37 ఏళ్ల క్రితం అక్కడ కనిపించకుండా పోయిన జర్మనీ దేశస్థుడి మృతదేహమని డీఎన్ఏ పరీక్షలో నిర్ధారించారు. సెప్టెంబరు 1986లో అదృశ్యమైన 38 ఏళ్ల జర్మన్ జాతీయుడి మృతదేహం ఇప్పుడు గుర్తించినట్టుగా సంబంధిత అధికారులు తెలిపారు. ఆ సమయంలో అతడు కనిపించకుండా పోవడంతో గాలింపు ముమ్మరం చేశారు. అయితే, చాలా రోజుల వరకు కూడా అతని మృతదేహం లభ్యం కాకపోవడంతో వెతకడం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో 37 ఏళ్ల తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. మంచు కరిగి పోవడంతో అతడి మృతదేహం బయటపడింది.
ఇటాలియన్ సరిహద్దు సమీపంలో మంచుతో కప్పబడిన థియోడుల్ పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు అతని మృతదేహాన్ని కొంతమంది హైకర్లు కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జన్యు పరీక్షలో అతడు ఎవరో నిర్ధారించారు. అయితే అతని పేరుతో సహా ఎలాంటి వ్యక్తిగత సమాచారం బయటకు రాలేదని తెలిసింది.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/feet-photos-f.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/indian-railways.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/big-fish-swallowed-womans-h.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/student-dies-of-heart-attac.jpg)
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇటువంటి అనేక ప్రదేశాలలో గ్లేసియర్ కరగడం పెరుగుతోంది. చాలా కాలంగా మంచుతో కప్పబడిన ప్రదేశాలు కూడా ఇప్పుడు కరిగిపోతున్నాయి. దీంతో చాలా సంవత్సరాల క్రితం తప్పిపోయిన పర్వతారోహకులు, స్కీయర్ల మృతదేహాలను గుర్తించేందుకు ఇదోక మార్గంగా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..