AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆంజనేయుడి గుడి కడదామని పునాదులు తవ్వుతున్నారు.. ఇంతలో అద్భుతం

ఊరంతా జమ కూడారు. మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టుకుందామని.. మంచిదని భావించారు. ఇందుకోసం విరాళాలు కూడా సేకరించారు. గ్రామ సర్పంచ్ తన పూర్వికుల భూమిని ఆలయ నిర్మాణం కోసం దానమిచ్చారు. అయితే ఇందుకోసం పునాదులు తవ్వుతుండగా ఏం బయటపడ్డాయో తెలుసా..?

Viral: ఆంజనేయుడి గుడి కడదామని పునాదులు తవ్వుతున్నారు.. ఇంతలో అద్భుతం
Ancident Coins
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2025 | 3:45 PM

Share

మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో గురువారం ఒక అరుదైన ఘటన వెలుగుచూసింది. ఊర్లో హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టలని గ్రామస్థులు సంకల్పించారు. ఇందుకోసం అందరూ చందాలు వేసుకున్నారు. టెంపుల్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనుల కోసం పునాదులు తవ్వుతుండగా.. ఆశ్చర్యకరంగా… ప్రాచీన కాలానికి చెందిన బంగారు నాణేలు బయటపడ్డాయి. సగౌరియా పురా గ్రామంలో జరుగుతున్న తవ్వకాల సమయంలో నాణేలు లభించడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ వార్త క్షణాల్లో ఊరంతా పాకింది. గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకుని ఆ నాణేలను ఆసక్తిగా పరిశీలించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సుమారు 50 నుండి 60 బంగారు నాణేలు బయటపడ్డాయని గ్రామ సర్పంచ్ సంతోషీలాల్ ఢాకడ్ తెలిపారు. అయితే పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ రాజేంద్ర పరిహార్ మాత్రం ఇప్పటివరకు కేవలం 20–25 నాణేలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం ఎంతమంది నాణేలు లభించాయి..? ఆ ప్రాంతంలో ఇంకా నాణేలు పాతిపెట్టి ఉన్నాయా..? అనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇక ఈ నాణేల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి నిపుణులను కూడా పిలిపిస్తున్నారు. అవి నిజంగానే ప్రాచీన కాలానికి చెందినవే అయితే, ఏ శకానికి సంబంధించినవో తెలుసుకోవడానికి పరిశోధన చేపట్టనున్నారు. ఈ నాణేలు బయటపడిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికారుల నివేదిక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Coins Unearthed

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..