Anand Mahindra: లగ్జరీ కారుతో సెల్ఫీ తీసుకుంటున్న సామాన్యుడు.. ఓనర్ చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా..
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వైరల్ వీడియోలో రోడ్డుపై ఒక ఖరీదైన లగ్జరీ పోర్షే కారు ఆగివుంది.. దాంతో ఓ సామాన్య వ్యక్తి ఆ కారు వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అది గమనించిన కారు యజమాని చేసిన పని ఆనంద్ మహీంద్రాను కదిలించింది. ఆ పాత వీడియో ఆగస్టు 9, 2024న ఇంటర్నెట్లో పోస్ట్ చేయబడింది. ఆ సమయంలో దీనికి 200 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. కాగా 1 కోటి 90 లక్షలకు పైగా వినియోగదారులు కూడా ఆ వీడియోను లైక్ చేశారు.

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ లో చేసిన పోస్ట్ ఒకటి విపరీతంగా వైరల్గా మారింది. ఆనంద్ మహీంద్రా ఇన్స్టాగ్రామ్లో రూ. 3 కోట్ల విలువైన కారు యజమానికి సంబంధించిన పాత వీడియో ఇది.. ఇప్పుడు ఈ వైరల్ వీడియోను షేర్ చేస్తూ తన హృదయాన్ని కదిలించిన దృశ్యమిది అంటూ ఆనంద్ మహీంద్ర రాసుకొచ్చారు. ఇది చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇంతకీ ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఆ పాత వీడియో కొత్తగా వైరల్ కావటం వెనుక అసలు స్టోరీ ఏంటంటే..
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వైరల్ వీడియోలో రోడ్డుపై ఒక ఖరీదైన లగ్జరీ పోర్షే కారు ఆగివుంది.. దాంతో ఓ సామాన్య వ్యక్తి ఆ కారు వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అది గమనించిన కారు యజమాని చేసిన పని ఆనంద్ మహీంద్రాను కదిలించింది. ఆ ఖరీదైన కారు ఓనర్ ఆ సామాన్య వ్యక్తిని అదే కారులో రైడ్కు తీసుకెళ్లి తన ఔదర్యం చాటుకుంటాడు. దీంతో సాధారణ వ్యక్తి ఎంతో సంతోషపడతాడు. ఈ క్లిప్ చూసి మనుసు చలించిపోయిన ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేశారు. ‘ఈ వీడియో పాతది కావొచ్చు.. నేను ఈ వీడియోను ఇటీవలే చూశాను, నన్ను ఈ వీడియో కదిలించింది. ముందుగా ఆ కారు యజమాని సానుభూతికి ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ రాశారు. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఆ పాత వీడియో ఆగస్టు 9, 2024న ఇంటర్నెట్లో పోస్ట్ చేయబడింది. ఆ సమయంలో దీనికి 200 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. కాగా 1 కోటి 90 లక్షలకు పైగా వినియోగదారులు కూడా ఆ వీడియోను లైక్ చేశారు. మహీంద్రా అదే వీడియోను తిరిగి పోస్ట్ చేసి,దానికి ప్రజల హృదయాల్ని హత్తుకునేలా క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..