Viral News: పీటల మీది పెళ్లిని ఆపేసిన రసగుల్లాలు… వరుడి విషయం తెలిసి పెళ్లికూతురు షాక్
వంద అబద్దాలైనా ఆడి ఒక పెళ్లి చేయాలంటారు. కానీ, వాస్తవాలు దాయకూడదు అనే విషయం మరిచి పెళ్లి చేయచూశారు. ఆఖరికి రసగుల్లాలు పీటల మీద పెళ్లిని ఆపేశాయి. ఈ సంఘటన బీహార్లోని నలందలో చోటు చేసుకుంది. పెళ్లి వేదిక మీద వరుడు అందరి ముందు చేసిన ఓ వధువు షాక్కు గురయింది. ఈ వరుడు వద్దంటే వద్దంటూ ఏకంగా...

వంద అబద్దాలైనా ఆడి ఒక పెళ్లి చేయాలంటారు. కానీ, వాస్తవాలు దాయకూడదు అనే విషయం మరిచి పెళ్లి చేయచూశారు. ఆఖరికి రసగుల్లాలు పీటల మీద పెళ్లిని ఆపేశాయి. ఈ సంఘటన బీహార్లోని నలందలో చోటు చేసుకుంది. పెళ్లి వేదిక మీద వరుడు అందరి ముందు చేసిన ఓ వధువు షాక్కు గురయింది. ఈ వరుడు వద్దంటే వద్దంటూ ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. పెళ్లి చేసుకోమని వరుడు వేడుకుంటున్నా ససేమిరా అంది. చివరికి వధువు లేకుండానే వరుడు వివాహ ఊరేగింపును ఖాళీ చేతులతో వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది.
సిలావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూయ్ గ్రామంలో బుధవారం రాత్రి వివాహ ఊరేగింపు వైభవంగా సాగింది. వధువు, వరుడి కుటుంబ సభ్యులు వివాహ ఊరేగింపుకు స్వాగతం పలికారు. తరువాత పూలమాల వేసే వంతు వచ్చింది. వధువు వరుడికి దండలు వేసిన వెంటనే, వారిద్దరికీ స్వీట్లు తినిపించారు. ఈ క్రమంలో వరుడు చేసిన పనికి వధువు ఆశ్చర్యానికి గురైంది.
స్వీట్లు తినే క్రమంలో వరుడు రెండు చేతులతో రసగుల్లాలు తీసుకొని తినడం ప్రారంభించాడు. ఇది చూసి పెళ్లికూతురు నిర్ఘాంతపోయింది. వరుడు మానసిక రోగి అని ఆమెకు తెలిసింది. వెంటనే పెళ్లికూతురు కోపంగా పెళ్లి వేదిక దిగి వచ్చింది. ఇలాంటి వ్యక్తిని ససేమిరా పెళ్లి చేసుకోనని చెప్పింది. అయితే వివాహాన్ని విచ్ఛిన్నం చేయవద్దని వరుడు ఆమెను వేడుకున్నా వినిపించుకోలేదు. వరుడి కుటుంబం కూడా వధువును ఒప్పించడానికి ప్రయత్నించినా వధువు ఒప్పుకోలేదు.
పెళ్లి సంబంధం కుదిరినప్పుడు, వరుడు మానసిక అనారోగ్యంతో ఉన్నాడని మాకు చెప్పలేదని వధువు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి క్షణంలోనైనా వరుడి మానసిక స్థితి తెలియడంతో తమ కూతురికి మంచి జరిగిందని చెప్పారు.