లోకల్ ట్రైన్ లో చాలా మంది జర్నీ చేస్తుంటారు. వివిధ పనుల కోసం వెళ్లే వారు లోకల్ రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఇవి పబ్లిక్ అసెట్ కాబట్టి వాటిని నీట్ గా ఉంచుకోవడం, తోటి ప్రయాణికులతో సామరస్యంగా ఉండటం చాలా ముఖ్యం..
Ad
Woman In Local Train
Follow us on
లోకల్ ట్రైన్ లో చాలా మంది జర్నీ చేస్తుంటారు. వివిధ పనుల కోసం వెళ్లే వారు లోకల్ రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఇవి పబ్లిక్ అసెట్ కాబట్టి వాటిని నీట్ గా ఉంచుకోవడం, తోటి ప్రయాణికులతో సామరస్యంగా ఉండటం చాలా ముఖ్యం. ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఎదురు సీటు ఖాళీగా ఉంటే వెంటనే కాళ్లు దానిపై పెట్టేస్తారు కొందరు. అలా చేయడం సరికాదని చెప్పినా వారు వినరు సరికదా..తిరిగి రివర్స్లో దాడికి దిగుతారు. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. అందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది. ముంబై లోకల్ ట్రైన్లో ఇద్దరు ప్రయాణీకులు తోటి ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించారు. స్నేహితుడితో కలిసి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న యువతి తనకు ఎదురుగా ఉన్న సీటుపై కాలు పెట్టి కూర్చుంది. ఆమె కాళ్లు పెట్టిన సీటులోనే ప్రశాంత్ అనే యువకుడు కూర్చుని ఉన్నాడు. ఆమెను కాలు తీయాలని కోరాడు. అందుకు సదరు యువతి, ఆమె స్నేహితుడు నిరాకరించారు.
దానికి ఆమె.. మా యిష్టం.. నువ్వెవరు అడగటానికి.. మేము లాయర్లం తెలుసా అంటూ బెదిరించింది. ఈ వీడియోను ఫొటో జర్నలిస్ట్ ప్రసాద్ ట్విట్టర్లో షేర్ చేయడంతో పాటు ముంబై పోలీసులు, రైల్వే అధికారులను ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ముంబై పోలీసులు కామెంట్స్ సెక్షన్లో ముంబై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను ట్యాగ్ చేశారు. ఈ వీడియో చూసి, యువతి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. యువతి తీరు సరికాదని, వీరిని ట్రైన్లో ప్రయాణించకుండా నిషేధించాలని రాసుకొచ్చారు.