Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mask less Man: మాస్క్ పెట్టుకోలేదని డ్రైవర్ కు ఫైన్.. దీంతో ఆ టాక్సీవాలా చేసిన పని చూడండి..

ప్రజలు మాస్క్ లు లేకుండా బయట తిరుగుతున్నారు. ప్రభుత్వ సిబ్బంది వారిని మాస్క్ లు పెట్టుకోమని అడిగినా.. జరిమానా వేసినా వారిపై దాడులకు తెగబడుతున్నారు.

Mask less Man: మాస్క్ పెట్టుకోలేదని డ్రైవర్ కు ఫైన్.. దీంతో ఆ టాక్సీవాలా చేసిన పని చూడండి..
Mask Less Man
Follow us
KVD Varma

|

Updated on: Sep 08, 2021 | 8:52 AM

Mask less Man: మహారాష్ట్ర కరోనా మూడోవేవ్ ముఖద్వారం వద్ద నిలబడి ఉంది. అయినా ప్రజలు మాస్క్ లు లేకుండా బయట తిరుగుతున్నారు. మాస్క్ లు ధరించమని ప్రజలను కోరడానికి బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ముంబైలోని వివిధ ప్రదేశాలలో ఫీల్డ్ మార్షల్స్‌ను నియమించింది. అలాంటి ఒక క్లీన్-అప్ మార్షల్స్ పని చాలా ఇబ్బందికరంగా మారింది. మాస్క్ పెట్టని వారిని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. దీంతో ఈ మార్షల్స్ పని కష్టతరంగా మారింది. అయినప్పటికీ మార్షల్స్ పట్టువదల కుండా ఎక్కడ మాస్క్ పెట్టుకోకుండా మనిషి కపించినా సరే.. వారిని వదలకుండా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మార్షల్ మాస్క్ పెట్టుకోమని ఒక కారు డ్రైవర్ ను కోరినందుకు.. ఆ డ్రైవర్ మార్షల్ ను తన కారు బోనెట్‌పై ఉరివేసి రోడ్డుపై చాలా దూరం లాక్కుని పోయాడు. సెప్టెంబర్ 2 న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. వారం తర్వాత కూడా నిందితుడు పోలీసులకు చిక్కలేదు.

ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఒక వ్యక్తి మాస్క్ లేకుండా కారు నడుపుతున్నాడు. అతడిని చూసి, సురేష్ అనే మార్షల్ తన కారును ఆపాడు. మాస్క్ లేనందుకు చలాన్ కట్ చేసి ఇచ్చాడు. చలాన్ సొమ్ము కట్టమని అడిగాడు. అయితే, ఆ డ్రైవర్ ఆగలేదు. కారును ఆపడానికి ప్రయత్నిస్తున్న మార్షల్‌పై కారు నడపడానికి ప్రయత్నించాడు. మార్షల్ ను కారుతో తాకించి.. బానేట్ మీద మార్షల్ పడిపోవడంతో అతనిని అలానే చాలా దూరం ఈడ్చుకుపోయాడు. కొంత దూరం తరువాత మార్షల్ కారు నుంచి జారిపడ్డాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి. కానీ, కారులో ఉన్న డ్రైవర్ వాహనాన్ని ఆపలేదు.

కారు మార్షల్ ను ఈడ్చుకుని పోతున్న వీడియో ఈ ట్వీట్ లో చూడొచ్చు..

వీడియో వైరల్ అయిన తర్వాత కేసు నమోదు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముంబైలో ముసుగు లేకుండా బయటకు వెళ్లినందుకు BMC ద్వారా రూ .200 జరిమానా ఆ కారు డ్రైవర్ కు విధించారు. కారు ఆపడానికి చాలా ప్రయత్నించానని సురేష్ చెప్పాడు. కానీ ఆ డ్రైవర్ కారు ఆపలేదు. వీడియో కనిపించిన తర్వాత, శాంతా క్రజ్ పోలీసులు సోమవారం గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పోలీసు వద్ద నిందితుడి వాహన నంబర్ ఉంది, కానీ ఇప్పటి వరకు అతను వారికి చిక్కలేదు.

మహారాష్ట్ర మూడవ వేవ్ ముఖద్వారం వద్ద ఉంది..

మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, మూడవ వేవ్ మా గుమ్మం వద్ద నిలబడి ఉంది. గత కొన్ని రోజులుగా, ముంబైలో ప్రతిరోజూ 400 కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Also Read: Chicken: వరణుడి ఎఫెక్ట్.. ఆ ఊరంతా కోడికూర జాతరే.. అసలు మ్యాటర్ తెలిస్తే అయ్యో పాపం అంటారు..

Wonder Kid: చిన్నాడో కాదు.. చిచ్చర పిడుగు.. ఒక్కసారి తెలిసిందంటే ఇక అంతే..