రీల్స్‌ తీస్తూ ప్రేమలో పడ్డారు..! కట్‌చేస్తే.. ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లాడిన 18 ఏళ్ల యువతి

ఒక పురుషునికి ఒకే స్త్రీ ఉంటుందని ఒక నానుడి ఉంది. కానీ ఈ కలియుగంలో అంతా తలకిందులవుతోంది. ఒక పురుషునికి ఎంతోమంది స్త్రీలు, ఒక స్త్రీకి ఎంతోమంది పురుషులు ఉన్న ఈ రోజుల్లో ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం అనుకునే స్థాయికి ఇది పెరిగిపోయింది. తాజాగా ఒక జంటకు సంబంధించిన విచిత్రమైన వార్త వైరల్‌గా మారింది.. ఇద్దరు పిల్లల తల్లి తన భర్తపై కోపంతో, 18ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంది..

రీల్స్‌ తీస్తూ ప్రేమలో పడ్డారు..! కట్‌చేస్తే.. ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లాడిన 18 ఏళ్ల యువతి
Woman Marries Woman

Updated on: Sep 11, 2026 | 5:21 PM

కర్ణాటక రాష్ట్రంలో ఒక విచిత్రమైన, సంచలనాత్మక ఉదంతం వెలుగు చూసింది. సామాజిక నియమాలు, కుటుంబాల అభ్యంతరాలను పక్కనబెట్టి ఇద్దరు మహిళలు ఒకరినొకరు వివాహం చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 18 సంవత్సరాల వయసున్న ఒక యువతి, ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న మరో మహిళను గుడిలో పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పరిచయం ఎలా మొదలైందంటే?

బాధిత కుటుంబాల వివరాల ప్రకారం.. ఈ ఇద్దరు మహిళల మధ్య కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. మొదట్లో సాధారణ స్నేహంగా ప్రారంభమైన వీరి బంధం, రోజులు గడిచేకొద్దీ గాఢమైన అనురాగానికి, ప్రేమకు దారితీసింది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ, ఆ మహిళ సదరు 18 ఏళ్ల యువతితోనే తన జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. యువతి కూడా ఆమెతో కలిసి జీవించేందుకు సిద్ధపడింది.

వీరిద్దరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా మందలించారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని వివాహితకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే చిన్న వయసులోనే జీవితాన్ని పాడుచేసుకోవద్దని యువతికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే, కుటుంబ సభ్యుల హెచ్చరికలను, సామాజిక ఒత్తిళ్లను వీరు కొట్టిపారేశారు. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఒక ఆలయానికి వెళ్లి సాంప్రదాయబద్ధంగా తాళి కట్టి పెళ్లి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పెళ్లి వార్త వెలుగులోకి రావడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందనే దానిపై బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల నిర్ణయం వల్ల పిల్లల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని స్థానికులు భావిస్తున్నారు. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా ఇద్దరు పిల్లల తల్లి మరొకరిని వివాహం చేసుకోవడం చట్టపరంగా చెల్లుతుందా లేదా అనే అంశంపై పోలీసులు, న్యాయ నిపుణులు విచారిస్తున్నారు.

సమాజం ఏమనుకున్నా, బంధువులు దూరమైనా సరే తామిద్దరం కలిసి ఒకే ఇంట్లో జీవిస్తామని ఆ మహిళలు స్పష్టం చేయడం గమనార్హం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us