టాప్ 10 న్యూస్ @1PM

1. వైసీపీలో చేరిన జనసేన, టీడీపీ నేతలు..! టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మరో షాక్‌ తగిలింది. జనసేన నేత ఆకుల సత్యనారాయణ, టీడీపీ నేత జూపూడి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో.. వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల నుంచి టీడీపీకి గట్టి దెబ్బలే.. Read more 2. తగ్గనంటోన్న కేసీఆర్.. ఆర్టీసీ తరువాత ఆ విభాగంలో ప్రక్షాళన మొదలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ.. తెలంగాణాలోని ఆర్టీసీ కార్మికులు […]

టాప్ 10 న్యూస్ @1PM
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 1:00 PM

1. వైసీపీలో చేరిన జనసేన, టీడీపీ నేతలు..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మరో షాక్‌ తగిలింది. జనసేన నేత ఆకుల సత్యనారాయణ, టీడీపీ నేత జూపూడి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో.. వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల నుంచి టీడీపీకి గట్టి దెబ్బలే.. Read more

2. తగ్గనంటోన్న కేసీఆర్.. ఆర్టీసీ తరువాత ఆ విభాగంలో ప్రక్షాళన మొదలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ.. తెలంగాణాలోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. వారి సమ్మె ఇవాళ్టితో నాలుగోరోజుకు చేరుకుంది. దీంతో పలు బస్టాప్‌లు నిర్మానుష్యంగా మారగా.. ప్రయాణికుల ఇక్కట్లు.. Read more

3. విశాఖ సమీపంలో తప్పిన పెను ప్రమాదం

విశాఖ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కసింకోట మండలం సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న రైళ్లును అధికారులు దువ్వాడలోనే నిలిపివేశారు. బయ్యవరం-పరవాడపాలెం మధ్య ఓ రైలు.. Read more

4. తిరుమల బ్రహ్మోత్సవాలు: అత్యంత వైభవంగా శ్రీవారి చక్రస్నానం

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. చివరి అంకమైన చక్రస్నాన ఘట్టాన్ని వేదపండితులు మంత్రోశ్చరణ నడుమ కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై.. Read more

5. ఆమ్లెట్‌లో పెంకులు.. షాక్ తిన్న ఎంపీ

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ నిర్లక్ష్యం కారణంగా రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల పూణె నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లిన ఆమె.. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆమ్లెట్‌ను ఆర్డర్ చేశారు. తనకు అందిన.. Read more

6. ఘనంగా మైసూరు దసరా ఉత్సవాలు!

మైసూరులో జరిగే దసరా వేడుకలు చూసి తీరాల్సిందే. గత నాలుగు వందల సంవత్సరాలుగా మైసూరులో దసరా వేడుకలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఈ వేడుకలను చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు. మైసూరు ఉత్సవాల సందడి.. Read more

7. గురుదక్షిణగా “కోటి” ఇల్లు.. ది గ్రేట్ తలైవా గిఫ్ట్ ఎవరికి..?

సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్ చెప్పినా.. స్టెప్పు వేసినా అదరహో అనాల్సిందే. ఇక థియేటర్‌లో అయితే రజనీ సినిమా విడుదలైందంటే చాలు గోలగోల చేస్తారు అభిమానులు. రజనీ ఏ పని చేసినా స్పెషల్‌గానే ఉంటుంది. అలాంటి హీరో రియల్ లైఫ్ లో.. Read more 

8. విజయాలను ప్రసాదించే విజయదశమి… ఈ రోజు ఏ పని ప్రారంభించినా విజయమే!

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు.. Read more

9. మెగాస్టార్@152.. కొరటాలకే బంపర్ ఛాన్స్..!

అటు మెగాభిమానులు, ఇటు సాధారణ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. చిరంజీవి- కొరటాల క్రేజీ కాంబో మూవీ ప్రారంభం అయిపోయింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా.. Read more

10. కశ్మీర్ పై మరో ‘ గొంతు ‘ విషం కక్కింది.. అదేంటో.. ఆయన మాటల్లోనే.. !

భారత-పాకిస్తాన్ దేశాలమధ్య రేగిన కశ్మీర్ చిచ్ఛుకు ఆజ్యం పోస్తూ … పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా రంగంలోకి దిగాడు. కశ్మీర్ అంశం పాక్ రక్తం లోనే ఉందని అంటూ… తిరిగి తాను క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు.. Read more

Latest Articles