తగ్గనంటోన్న కేసీఆర్.. ఆర్టీసీ తరువాత ఆ విభాగంలో ప్రక్షాళన మొదలు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ.. తెలంగాణాలోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. వారి సమ్మె ఇవాళ్టితో నాలుగోరోజుకు చేరుకుంది. దీంతో పలు బస్టాప్లు నిర్మానుష్యంగా మారగా.. ప్రయాణికుల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. అయితే కార్మికుల సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని కుండబద్ధలు కొట్టి చెప్పారు. అలాగని ప్రైవేటీకరణ కూడా చేయబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరు […]
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ.. తెలంగాణాలోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. వారి సమ్మె ఇవాళ్టితో నాలుగోరోజుకు చేరుకుంది. దీంతో పలు బస్టాప్లు నిర్మానుష్యంగా మారగా.. ప్రయాణికుల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. అయితే కార్మికుల సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని కుండబద్ధలు కొట్టి చెప్పారు. అలాగని ప్రైవేటీకరణ కూడా చేయబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇచ్చిన కేసీఆర్.. రెండోసారి టర్మ్లోకి వచ్చినప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2014లో ఆర్టీసీ సిబ్బంది అడిగిన దాని కంటే ఎక్కువగా 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన సీఎం.. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను తీవ్రంగా పరిగణిస్తున్నారు.
కాగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలని, సంస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారట. దీంతో ఎవరి మాట వినేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరని ఆయన తీరును చూస్తే అర్థం అవుతోంది. ఈ క్రమంలోనే విధులకు రాని ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించేలా ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ రెవెన్యూ విభాగం, వీఆర్వోలేనని తెలుస్తోంది. వీఆర్వోల వ్యవస్థపై సీఎం చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే వీఆర్వీలను లేకుండా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న కేసీఆర్.. ఆర్టీసీ సమస్య ఓ కొలిక్కి వచ్చాక.. ఆ విభాగంపై ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. అలాగే కొత్త మున్సిపల్ చట్టం ద్వారా మున్సిపల్ సిబ్బందికి కూడా సీఎం షాకిచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరి అభిప్రాయం. మొత్తానికి ప్రజలకు మేలు చేకూర్చడం కోసం, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసం త్వరలో కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఖాయమని ఆయన తాజా చర్యల వలన అర్థమవుతోంది.