మెగాస్టార్@152.. కొరటాలకే బంపర్ ఛాన్స్..!

అటు మెగాభిమానులు, ఇటు సాధారణ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. చిరంజీవి- కొరటాల క్రేజీ కాంబో మూవీ ప్రారంభం అయిపోయింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీతో పాటు దర్శకుడు కొరటాల తదితరులు పాల్గొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు తిరు సినిమాటోగ్రాఫర్‌గా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేయనున్నారు. […]

మెగాస్టార్@152.. కొరటాలకే బంపర్ ఛాన్స్..!
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 12:02 PM

అటు మెగాభిమానులు, ఇటు సాధారణ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. చిరంజీవి- కొరటాల క్రేజీ కాంబో మూవీ ప్రారంభం అయిపోయింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీతో పాటు దర్శకుడు కొరటాల తదితరులు పాల్గొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు తిరు సినిమాటోగ్రాఫర్‌గా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

అయితే మిర్చి సినిమాతో టాలీవుడ్‌‌లో డైరక్టర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన కొరటాల.. వరుసగా నాలుగు హిట్లతో టాప్ డైరక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఆయన డైరక్ట్ చేయబోతున్నాడని తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మొదలయ్యాయి. వాటికి తగ్గట్లుగా సినిమా ఉండబోతుందని ఫిలింనగర్‌లో వార్తలు వినిస్తున్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఇటీవల సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ఆ మూవీతో మరో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజు నుంచి అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 150కోట్ల గ్రాస్‌ను సాధించిన సైరా.. ఓవర్సీస్‌లో దూసుకుపోతోంది. దసరా పండుగ సీజన్ కావడంతో అన్ని చోట్ల కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి.