మెగాస్టార్@152.. కొరటాలకే బంపర్ ఛాన్స్..!
అటు మెగాభిమానులు, ఇటు సాధారణ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. చిరంజీవి- కొరటాల క్రేజీ కాంబో మూవీ ప్రారంభం అయిపోయింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీతో పాటు దర్శకుడు కొరటాల తదితరులు పాల్గొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్కు తిరు సినిమాటోగ్రాఫర్గా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా పనిచేయనున్నారు. […]
అటు మెగాభిమానులు, ఇటు సాధారణ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. చిరంజీవి- కొరటాల క్రేజీ కాంబో మూవీ ప్రారంభం అయిపోయింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీతో పాటు దర్శకుడు కొరటాల తదితరులు పాల్గొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్కు తిరు సినిమాటోగ్రాఫర్గా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా పనిచేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
అయితే మిర్చి సినిమాతో టాలీవుడ్లో డైరక్టర్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన కొరటాల.. వరుసగా నాలుగు హిట్లతో టాప్ డైరక్టర్ల లిస్ట్లో చేరిపోయాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఆయన డైరక్ట్ చేయబోతున్నాడని తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మొదలయ్యాయి. వాటికి తగ్గట్లుగా సినిమా ఉండబోతుందని ఫిలింనగర్లో వార్తలు వినిస్తున్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
#Chiru152 has been formally launched. @KonidelaPro in association with @MatineeEnt will produce the film. Written & Directed by @sivakoratala garu. DOP – @DOP_Tirru Editor – @sreekar_prasadProduction Design – @sureshsrajan.
Shoot begins soon! pic.twitter.com/Kn4QEdwqH7
— Konidela Pro Company (@KonidelaPro) October 8, 2019
ఇదిలా ఉంటే ఇటీవల సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ఆ మూవీతో మరో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజు నుంచి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ను సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 150కోట్ల గ్రాస్ను సాధించిన సైరా.. ఓవర్సీస్లో దూసుకుపోతోంది. దసరా పండుగ సీజన్ కావడంతో అన్ని చోట్ల కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి.