‘కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా’.. బండి సంజయ్..
హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను కించపరుస్తారా? అని కేటీఆర్ను నిలదీశారు. హిందువులారా.. మీ సత్తా ఏందో కేసీఆర్కు మళ్లీ రుచి చూపించండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను కించపరుస్తారా? అని కేటీఆర్ను నిలదీశారు. హిందువులారా.. మీ సత్తా ఏందో కేసీఆర్కు మళ్లీ రుచి చూపించండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, వినోద్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తారా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. తన వెనుక 80 శాతం హిందువులున్నారన్నారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బుద్ది చెప్పండని పిలుపునిచ్చారు. కేటీఆర్ నోటి నుండి జై శ్రీరాం మాటే రాదని.. కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరని ధ్వజమెత్తారు. తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. చర్చకు సిద్ధమైతే.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి ఆధారాలు చూపిస్తామన్నారు. వీటన్నింటిపై ప్రశ్నిస్తుంటే.. తనను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయని ఆరోపించారు. సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరు కాదా అని నిలదీశారు బండి సంజయ్. రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత తనదని.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..