శవయాత్రగా మారుతున్న సరదా యాత్రలు..మాసాలోద్ది జలపాతంలో పడి బీటెక్ విద్యార్థి మృతి..

వర్షాకాలం వస్తే చాలు పచ్చని ప్రకృతి, జాలువారే జలపాతాలను చూసేందుకు పర్యాటకులు పరుగులు తీస్తుంటారు. అయితే, అటవీశాఖ ఆంక్షలను, హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్ల పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ములుగు జిల్లాలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సరదాగా గడపడానికి స్నేహితులతో కలిసి వచ్చిన ఆ బాలుడి ప్రాణాలను జలపాతం మింగేసింది.

శవయాత్రగా మారుతున్న సరదా యాత్రలు..మాసాలోద్ది జలపాతంలో పడి బీటెక్ విద్యార్థి మృతి..
Btech Student Death

Edited By:

Updated on: Jul 09, 2026 | 1:08 PM

వర్షాకాలం వచ్చిందంటేచాలు జలపాతాల సందర్శన కోసం పరుగులు తీసే జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. అటవీశాఖ ఆంక్షలు బేఖాతరు చేస్తూ జల సమాది అవుతున్నారు. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్థి జల పాతళంలో పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది.. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వచ్చిన ఆ బాలుడి ప్రాణాలు జలపాతాలు మింగేశాయి..ఘనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ – ఛత్తీస్ గడ్ సరిహద్దు:

ములుగు జిల్లాలోని జలపాతాలు ప్రమాదాలకు కేరాఫ్ గా మారాయి.. ఈ ప్రాంతంలో మొత్తం తొమ్మిది జలపాతాలు ఉన్నాయి. కానీ కేవలం బొగత జలపాతాలకు మాత్రమే అటవీశాఖ అనుమతి ఉంది.. అక్కడికి మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు..అనుమతిలేని జలపాతాల సందర్శనకు వెళ్ళే జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. తాజాగా
వాజేడు మండలం దూలాపురం గ్రామ శివారులోని మాసాలోద్ది జలపాతం మరో యువకుడి ప్రాణాన్ని బలిగొంది. సిద్దిపేట జిల్లాకు చెందిన యాదవైభవ్ కుమార్ (18)బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి, ఆరుగురు స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు.

ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల సమాచారం ప్రకారం, జలపాతం వద్దదిగుతూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న సమయంలో వైభవ్ కుమార్ కాలుజారి నీటిలో పడిపోయాడు.. అక్కడే ఉన్న కొందరు యువకులు వెంటనే ధైర్యంచేసి అతడిని నీటిలో నుంచి బయటకు తీశారు. వెంటనే cpr చేశారు..

ఇవి కూడా చదవండి

సమయం వృథా చేయకుండా బైక్‌ పై వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఆసుపత్రికి చేరుకున్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడ విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ అత్యవసరంగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వైభవ్ కుమార్ మృతి చెందాడు

సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వర్షాకాలంలో జలపాతాల వద్ద ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతాచర్యలు, హెచ్చరిక బోర్డులు, పర్యాటకుల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.. అనుమతి లేని జలపాతాల వద్దకు వెళ్లవద్దని పోలీసులు, అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us