AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. పొలంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మహిళా కూలీలు మృతి.. ఆమె కోసం వెళ్లి ఈమె కూడా

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు విడిచారు.  జిల్లాలోని నర్సాపూర్ మండలం గూడెంగడ్డలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. పొలంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మహిళా కూలీలు మృతి.. ఆమె కోసం వెళ్లి ఈమె కూడా
Ram Naramaneni
|

Updated on: Feb 11, 2021 | 10:13 PM

Share

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు విడిచారు.  జిల్లాలోని నర్సాపూర్ మండలం గూడెంగడ్డలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కౌలురైతు మల్లేశం తన పొలంలో కలుపు తీయడానికి నవనీత, లక్ష్మీ, జ్యోతి, లత, వసంతలను వెంట తీసుకువెళ్లారు. సర్వీసు తీగ నవనీత(38) కాళ్లకు విద్యుత్ తీగలు తాకగా కరెంట్ షాక్​కు గురైంది. ఇది చూసి లక్ష్మీ(35) దగ్గరికి వెళ్లగా.. ఆమె కూడా కరెంట్ షాక్ కొట్టింది.  ఇద్దరూ స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. మిగతా వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న సీఐ లింగేశ్వర రావు, ఎస్సై గంగరాజు ఘటనా స్థలానికి వెళ్లి డెడ్‌బాడీలను నర్సాపూర్ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని విలపించారు. బాధ్యులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

Also Read:

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. రేగు పండ్ల కోసం వెళ్లి.. వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి

ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీ